Railway Projects: 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(Cabinet Committee on Economic Affairs) సమావేశమైంది. ఈ సందర్భంగా సుమారు రూ.24,634 కోట్లతో నాలుగు మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు(Railway project)లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర(Maharashtra), మధ్యప్రదేశ్(Madhya Pradesh), గుజరాత్(Gujarath), ఛత్తీస్గఢ్(Chhattisgarh)లోని 18 జిల్లాల్లో ఈ నాలుగు ప్రాజెక్టులు భారతీయ రైల్వే నెట్వర్క్ను సుమారు 894 కి.మీ.ల మేర విస్తరించనున్నాయి.
కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ వైష్ణవ్..
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ వైష్ణవ్(Minister Ashwin Kumar Vaishnav) మీడియాతో మాట్లాడుతూ, పీఎం గతిశక్తి కార్యక్రమం కింద సుమారు రూ.24,634 కోట్లతో నాలుగు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి క్యాబినెట్ ఓకే చేసిందన్నారు. 2030–31 నాటికి ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు ప్రజలు, వస్తువులు, సేవల రవాణాను సజావుగా కనెక్టివిటీ చేస్తున్నదన్నారు.
Also Read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కారుకు యాక్సిడెంట్.. అసలేం జరిగిందంటే?
కేంద్రం ఆమోదించిన నాలుగు ప్రాజెక్టులు ఇవే:
వార్ధా – భుసావల్ 3వ, 4వ లైన్ – 314 కిమీ (మహారాష్ట్ర)
గోండియా డోంగర్ఘర్ 4వ లైన్ – 84 కి.మీ (మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్)
వడోదర – రత్లాం 3వ, 4వ లైన్ – 259 కి.మీ (గుజరాత్, మధ్యప్రదేశ్)
ఇటార్సి – భోపాల్ బినా 4వ లైన్ – 237 కి.మీ. (మధ్యప్రదేశ్)
Also Read: Nizamabad: ఆ జిల్లాలో కష్టకాలంలో.. పార్టీ జెండా మోసినవాళ్లకే జిల్లా పరిషత్
