Drugs-Case (Image source Swetcha)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Ganja Smuggling: ఆలయం సమీపంలో గంజాయి విక్రయాలు.. ముగ్గురి అరెస్ట్​

Ganja Smuggling: ముగ్గురిని అరెస్ట్ చేసిన ఎక్సయిజ్ పోలీసులు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: దేవాలయానికి సమీపంలో గంజాయి విక్రయిస్తున్న (Ganja Smuggling) ముగ్గురిని ఎక్సైజ్​ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీఎఫ్​ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 3.230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన భరత్​, ఉమేష్​, శశికాంత్ ముగ్గురు కొన్ని రోజులుగా గంజాయి దందా చేస్తున్నారు. ధూల్‌పేట నుంచి గంజాయి కొని బోయిన్‌పల్లి పరిసరాల్లో అమ్ముతున్నారు. గురువారం బోయిన్ పల్లిలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో భరత్​, ఉమేశ్ గంజాయి అమ్ముతుండగా డీటీఎఫ్ సీఐ సౌజన్య సిబ్బందితో క​లిసి అరెస్ట్ చేశారు. దీనికి కొద్దిదూరంలోనే గంజాయి విక్రయిస్తున్న శశికాంత్‌ను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3.230 కిలోల గంజాయిని సీజ్​ చేశారు. ముగ్గురిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి సికింద్రాబాద్ ఎక్సైజ్​ పోలీసులకు అప్పగించారు.

Read Also- Konda Reddy Arrest Case: వైసీపీ విద్యార్థి నేత అరెస్టుపై ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు సంధించిన గుడివాడ అమర్నాథ్

డ్రగ్స్​ ఓవర్ డోస్‌తో యువకుడి మృతి

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డ్రగ్స్ ఓవర్ డోస్​ కారణంగా యువకుడు మృత్యువాత పడ్డాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన రాజేంద్రనగర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పాతబస్తీకి చెందిన అహమద్ అలీ వృత్తిరీత్యా మొబైల్​ రిపేర్లు చేస్తున్నాడు. శివరాంపల్లిలోని కెన్వర్త్ అపార్ట్‌మెంట్‌లోని 805వ నెంబర్​ ఫ్లాట్‌లో అహమద్​ అలీ, అతడి స్నేహితుడు సయ్యద్​ ఇద్దరు యువతులతో కలిసి లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉంటున్నారు. బుధవారం రాత్రి సయ్యద్‌తోపాటు వీరితో ఉంటున్న ఓ యువతి కలిసి డ్రగ్స్​ పార్టీ చేసుకున్నారు. ఓవర్​ డోస్ కావటంతో అహమద్ అలీ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే సయ్యద్​ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు కెన్వర్త్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అయితే, అహమద్ అలీ అప్పటికే చనిపోయాడు. పంచనామా జరిపిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తర​లించారు. ఇక, అహమద్​ అలీతోపాటు ఫ్లాట్‌లో ఉంటున్న సయ్యద్, ఇద్దరు యువతులకు డ్రగ్ పరీక్షలు జరిపించారు. దీంట్లో సయ్యద్‌తోపాటు ఓ యువతి మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది.

Read Also- Bigg Boss Telugu 9: సీక్రెట్ రెబల్.. హౌస్‌లో అసలు సిసలు బిగ్ బాస్ ఆట మొదలైంది

డ్రగ్స్ సేవించినట్టు చెప్పారు

బుధవారం రాత్రి డ్రగ్స్ తీసుకుని అహమద్​ అలీ స్పృహ కోల్పోయినట్టుగా తమకు సమాచారం వచ్చినట్టు రాజేంద్రనగర్​ సీఐ క్యాస్ట్రో చెప్పారు. తాము వెళ్లే సరికే అహమద్​ అలీ చనిపోయాడన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు తెలియడంతో మిగతా ముగ్గురికి డ్రగ్​ టెస్టులు జరిపించామన్నారు. దీంట్లో సయ్యద్​, మరో యువతి డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యిందన్నారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్నారు. విచారణలో లక్డీకాపూల్​ ప్రాంతం నుంచి డ్రగ్స్ తెచ్చినట్టుగా వెల్లడయ్యిందని తెలిపారు. ఎవరి నుంచి డ్రగ్స్​ కొన్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అపార్ట్ మెంట్లలో ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Just In

01

Akhanda 2: బాలయ్య పాన్ ఇండియా ప్రచారంలో దూకుడేది.. ఇంకా అనుమానాలేనా?

Parasakthi: శ్రీలీలతో రెట్రో రొమాన్స్‌లో శివకార్తికేయన్‌.. ‘పరాశక్తి’ సాంగ్ అదిరింది

Ram Mohan Naidu: 52 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కేంద్రమంత్రి రామ్మోహన్ భేటీ.. ఎందుకంటే?

Rana Daggubati: కాలాన్ని రీ క్రియేట్ చేయగలిగేది ఒక్క సినిమా మాత్రమే!

Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!