Gold Rates (09-07-2025) ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates (09-07-2025): భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్ .. ఎంత తగ్గిందంటే?

Gold Rates (09-07-2025): ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే, దేశంలో ఆర్థిక సమస్యల పెరుగుదలతో కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి. ధరలు పెరిగితే కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ధరలు తగ్గితే మాత్రం బంగారం కొనేందుకు జనం ఆసక్తి చూపుతారు. ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు తప్పనిసరి. శుభకార్యాల్లో మహిళలు బంగారు ఆభరణాలు ధరించి సంతోష పడతారు.

పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లి సీజన్‌లో బంగారం ధరలు కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,180 గా ఉంది. పెళ్లి సీజన్ ముగిసిన తర్వాత బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల కారణంగా ధరలు తగ్గవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: KTR Challenges CM Revanth: చర్చకు రాకుంటే ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి.. కేటీఆర్ సంచలన కామెంట్స్!

గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నప్పటికీ, నేడు భారీగా తగ్గడంతో మహిళలు గోల్డ్  షాపుకు వెళ్తున్నారు.   24 క్యారెట్ల బంగారం ధర రూ.660 కి తగ్గి రూ.98,180 గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 కి తగ్గి రూ.90,600 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లో బంగారం, వెండి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.98,180

విజయవాడ ( Vijayawada) – రూ.98,180

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.98,180

వరంగల్ ( warangal ) – రూ.98,180

Also Read: Bhadradri Kothagudem: రెచ్చిపోతున్న కంకర మాఫియా.. నాసిరకం కంకరతో నిలువు దోపిడీ

24 క్యారెట్లు బంగారం ధర

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.90,600

వరంగల్ ( warangal ) – రూ.90,600

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.90,600

విజయవాడ – రూ.90,600

Also Read: GHMC Regulations: పర్మిషన్స్ ఉన్నా ‘ఎన్ఓసీ’ తీసుకురావాల్సిందే.. జీహెచ్‌ఎంసీ కొత్త నిబంధనతో వణికిపోతున్న బిల్డర్లు

వెండి ధరలు

గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.14,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,20,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

విజయవాడ – రూ.1,20,000

విశాఖపట్టణం – రూ.1,20,000

హైదరాబాద్ – రూ.1,20,000

వరంగల్ – రూ.1,20,000

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు