Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొట్టండి!
lakshmi devi ( Image Source: Twitter)
Viral News

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

Hindu Rituals: కొబ్బరికాయను శివుని మూడు కళ్లకు సంకేతంగా చెబుతారు. ఇది బ్రహ్మ, విష్ణు, శివుడు. త్రిమూర్తులను సూచిస్తుందని నమ్ముతారు. గణేశుడికి కొబ్బరికాయను సమర్పించడం మనలోని అహంకారాన్ని ఊడ్చివేసి, ఆయన దీవెనలను తెచ్చిపెడుతుంది. కొబ్బరికాయ బయటి పొట్టు అహంకారాన్ని, లోపలి స్వచ్ఛమైన నీరు పవిత్రతను సూచిస్తూ, గణేశుడికి అత్యంత ఇష్టమైన నైవేద్యంగా నిలుస్తుంది. అయితే, ఇది ఒక్క వినాయకుడికే కాకుండా  లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం కూడా చాలా మంది కొబ్బరి కాయలు కొడుతుంటారు.

Also Read: Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

కొబ్బరికాయను కొట్టేటప్పుడు ఎంతో మంది తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు. దీని ప్రభావం మన ఆర్ధిక పరిస్థితుల మీద పడుతుంది. కాబట్టి, కొబ్బరికాయను కొట్టేటప్పుడు లక్ష్మీ దేవిని కూడా తలచుకుంటే ఆమె అనుగ్రహం తప్పక లభిస్తుంది.

గణేశుడి ఆలయంలో కొబ్బరికాయను పగలగొట్టి సమర్పిస్తే, మనలోని చెడు ఆలోచనలు, అహంకారం పటాపటా పోయి, ఆయన కృప కలుగుతుంది. ఆలయానికి వెళ్లి, గణేశుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, మనసులో మన బాధలు, కష్టాలను ఆయనతో చెప్పుకుని, అడ్డంకులు తీరిపోవాలని వేడుకోవాలి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు, దాని నీరు చెల్లాచెదరైనట్లే మన సమస్యలు కూడా చిత్తడైపోతాయని నమ్మకం. ఇది కుటుంబ కలహాలు, చెడు దృష్టి, ఆస్తి గొడవలు, అప్పుల బాధలను తీర్చడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దీనితో కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొని, ఇల్లు ఆనందంతో నిండిపోతుంది.

Also Read: Alcohol Addiction: ఆకలితో ఉన్నప్పుడు బాటిల్స్ మీద బాటిల్స్ మద్యం సేవిస్తున్నారా.. బయట పడ్డ షాకింగ్ నిజాలు

గణేశుడికి సంకష్టహర చతుర్థి రోజు చాలా ప్రీతికరం. ఈ రోజున చాలామంది ఉపవాసం ఉండి, రాత్రి విరమిస్తారు. ఈ ఉపవాసం మనలో జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతుంది. సంకష్టహర చతుర్థి రోజున గణేశుడికి శనగలు, పప్పు పులుసు సమర్పించి, కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే, జీవితంలోని అన్ని కష్టాలు పటాపటా దూరమవుతాయి. అలాగే, సోమవారం రోజున ఒక కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి, అందులో కొబ్బరి నూనె పోసి, దూది వత్తితో గణేశుడికి దీపం వెలిగించాలి. ఈ సమయంలో “ఓం విఘ్న వినాయకాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ దీపం వెలిగిస్తే, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలా చేసిన తర్వాత  గణేశుడి పూర్తి ఆశీస్సులు లభించి, జీవితంలోని అడ్డంకులన్ని తొలిగిపోతాయి.

Also Read: Thummala Nageswara Rao: పత్తికొనుగోళ్లపై పర్యవేక్షణ చేయాలి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?