Fire Accident: కారేపల్లి జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
Fire Accident (imagecredit:swetcha)
ఖమ్మం

Fire Accident: కారేపల్లి జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. సంఘటన పై అనుమానాలెన్నో..?

Fire Accident: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ ప్రియా కోటిక్స్ జిన్నింగ్ మిల్లు(Sri Lakshmi Priya Cottons Ginning Mill)లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. జిన్నింగ్ చేసే మిషన్ల వద్ద నుంచి ప్రమాదం జరిగి పత్తి కాలుతుండటంతో గమనించిన సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో సీసీఐ(CCI) కి చెందిన పత్తి కొంత వరకు కాలిపోయింది. మిల్లులో 30 కి పైగా పత్తి జిన్నింగ్ చేసే మిషన్లకు మంటలు అంటుకొన్నాయి.

ప్రమాదంపై అనేక అనుమానాలు

జింగ్ మిల్లు అగ్నిప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిన్నింగ్ చేసే మిషన్ల వద్దనే మంటలు రావడం అది కూడా మొత్తం మిషన్లు అంటుకోవడంపై అనుమానాలకు దారి తీస్తున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా? ఇన్సూరెన్స్ కోసం పథకం ప్రకారం చేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సీసీఐ తీరులోను అనుమానాలు

కారేపల్లిలోని లక్ష్మీ ప్రియ కోటక్ జిన్నింగ్ మిల్లులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిసిఐ పత్తి కొనుగోలు ప్రారంభం నుంచే ఇక్కడ అధికారులు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మామూలు తీసుకొని పనికిరాని పత్తిని కూడా పాసింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. కష్టపడి పండించిన రైతు మిల్లు వద్దకు వస్తే నాన్న కొర్రీలు పెట్టి ఇబ్బంది పెట్టే సిసిఐ అధికారులు దళారులు, వ్యాపారులు తెచ్చే పనికిరాని పత్తిని కూడా ఎలా కొనుగోలు చేశారనే దానిపై కారేపల్లిలో బహిరంగంగానే చర్చ జరుగుతుంది.

Also Read: Love Letters: బ్యాచ్‌లర్స్ ప్రదీప్, సుడిగాలి సుధీర్‌కు ప్రేమలేఖలు.. ఆ లేఖల్లో ఏముందంటే?

మిల్లు యాజమాని, బయ్యర్ కుమ్మకయ్యారా?

కారేపల్లిలోని జిన్నింగ్ మిల్లుకు ఇన్సూరెన్స్ ఉండటం, సిసిఐ కొనుగోలు కేంద్రానికి కూడా ఇన్సూరెన్స్(Insurance) ఉండడంతో మిల్లు యజమాని సీసీఐ బయ్యర్ కుమ్మక్కై పథకం ప్రకారం అగ్ని ప్రమాదాన్ని సృష్టించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిన్నింగ్ మిల్లు బ్యాంకులోన్ లో ఉండటం, సిసి అధికారులు ఆది నుంచే కొనుగోళ్ళలో అనేక అక్రమాలకు పాల్పడటంతో పాటు అనేక విషయాలను క్రోడీకరిస్తే ఈ సంఘటనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పాతికేళ్ల క్రితం కారేపల్లిలో ఇదే జరిగింది

మండల కేంద్రమైన కారేపల్లిలో 1995 లోనే ఒక జిన్నింగ్ మిల్లు నిర్మించారు. అది 2000 సంవత్సరంలో అగ్ని ప్రమాదానికి గురైంది. అది కూడా బూటకపు అగ్నిప్రమాదమే. కేవలం ఇన్సూరెన్స్ కోసమే ఆనాడు అప్పటి జిన్నింగ్ మిల్ యజమాని కొందరు రాజకీయ నాయకులు కలిసి దాన్ని అగ్ని ప్రమాదంగా సృష్టించి భారీగా ఇన్సూరెన్స్ డబ్బులు కాచేశారు. అంతటితోనే మిల్లు కార్యకలాపాలు నిలిచిపోయాయి. అప్పట్లో మిల్లుకు రుణం ఇచ్చిన బ్యాంకు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని వేలంపాట కూడా వేసింది. పాతికేళ్ల తర్వాత అదే తరహాలో పునరావృతమైందని మండల వాసులంతా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిఘా వ్యవస్థ కూడా ఆదిశగా విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: Anasuya Post: ఏంట్రా ఇలా ఉన్నారు!.. ఎవరు యూటర్న్ తీసుకుంది?.. అనసూయ..

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?