Anasuya Post: యాంకర్ అనసూయ యాక్టర్ శివాజీని టార్గెట్ చేస్తూ ఇటీవల చేసిన వీడియోలు, పోస్టులు ఎంతటి సంచలనం క్రియేట్ చేశాయో తెలిసిందే తాజాగా ఇదే వివాదంపై అనసూయ మరో సారి పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఇంతకు ముందు పెట్టిన వీడియోలో అనసూయ యాక్టర్ శివాజీని అలా కాకుండా ఇలా అంటే బాగుండేదని చెప్పుకొచ్చారు. దానికి అనసూయ యూటర్న్ తీసుకుందని అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది చూసిన అనసూయ రో పోస్ట్ పెట్టారు. అందులో అసలు ఏవరు ఏం మాట్లాడుతున్నరు.. ‘రేయ్ రేయ్ ఇంకెంత ట్విస్ట్ చేస్తార్రా.. మాటను ఎవరు? యూ టర్న, ఎవరు దిగివచ్చారు. ఎవరు ఎట్టకేలకు తప్పించుకుంటున్నారు. ఇంతేనా మీ గతి.. వేరే పనికి వచ్చే డిష్కషన్లు ఏమైనా ఉంటే పెట్టండిరా బాబు.’ అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. దీంతో మరోసారి ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
Read also-Prabhas Fan: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్ వెయ్యలేదని అభిమాని చేసింది చూస్తే షాక్ అవుతారు..
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన యాక్టర్ శివాజీ వ్యాఖ్యలు మరో సారి వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయం గురించి దాదాపు ప్రజలందరూ మర్చిపోతుంటే.. అనసూయ మాత్రం మరో వీడియో పెట్టి యాక్టర్ శివాజీ గురించి సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో మరోసారి వైరల్ అయింది. ఇంతకూ ఈ వీడియోలో ఏం అన్నరంటే.. తను అనారోగ్యానికి గురయ్యానని, టైప్ చేయడానికి ఓపిక లేక ఇలా వీడియో చేస్తున్నానని అన్నారు. అంతే కాకుండా.. యాక్టర్ శివాజీ జీవితంలో ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారని, మంచి పాత్రలు ఆయనకు అలాంటి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాయన్నారు. అలాంటి వారు వేదికలపై నిలబడి ఏం చెప్పినా చాలా మంది వాటిని వింటారని, అందుకు చాలా పద్దతిగా మాట్లాడి ఉంటే బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆయన ఉద్ధేశం మంచిదే అయినా ఆ రెండు పదాలు అనకుండా ఉంటే బాగుండేదన్నారు. అదే విధంగా.. అంత పెద్ద యాక్టర్ అంత పెద్ద వేదికపై ఆ రెండు మాటలు కాకుండా.. అదే సందర్భంలో మహిళల స్వేచ్ఛను వారికి ఇచ్చేసి, వారిని మనం కాపాడుకుంటే బాగుంటుంది. అని చెప్పి ఉంటే బాగుండేదని అనసూయ అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు ఇలాంటి మాటలు ముందే అని ఉంటే బాగుండేది కదా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read also-Sankranthi 2026: కళ్యాణ్ పడాల, తనూజ కలిసి డ్యాన్స్.. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఈ వేడుకలోనే!

