Remand Prisoner Died: గుండెపోటుతో జగిత్యాల సబ్జైలులో రిమాండ్ ఖైదీ మృతి
జగిత్యాల, స్వేచ్ఛ: జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీ గుండెపోటుతో (Remand Prisoner Died) మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. ఖైదీ మృతి ఘటన స్థానికంగా కలకలం రేపింది. చనిపోయిన వ్యక్తి నిర్మల్ జిల్లాకు చెందిన కొత్వల్ కృష్ణ. అతడి వయసు 43 సంవత్సరాలు. సైబర్ క్రైమ్ కేసులో రిమాండ్లో ఉన్నాడు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో జైలులో ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయాడు. విషయాన్ని తోటి ఖైదీలు గుర్తించి వెంటనే జైలు అధికారులకు సమాచారం అందించారు.
Read Also- Women Driver Job Mela: హైదరాబాద్ మహిళలకు ఉపాధి అవకాశాలు.. సజ్జనార్ కీలక ప్రకటన
జైలు అధికారులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి కొత్వల్ కృష్ణను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. అయితే, కృష్ణకు హార్ట్ ఎటాక్ రావడంతోనే మృతి చెందినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తు అనంతరం ఘటనకు సంబంధించిన విషయాలపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also- Medak Tragedy: మూడు కార్లలో గోవా టూర్.. తిరిగొస్తుండగా బిగ్ షాక్.. ముగ్గురు స్పాట్ డెడ్

