Kapas Kisan App: కౌలు రైతుల‌కు క‌పాస్ క‌ష్టాలు
Kapas Kisan App (imagecredit:swetcha)
Telangana News

Kapas Kisan App: కౌలు రైతుల‌కు క‌పాస్ క‌ష్టాలు.. 32వేల ఎక‌రాలు పంట న‌ష్టం

Kapas Kisan App: క‌పాస్ కిసాన్ యాప్‌తో కౌలు రైతుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని, వారిని ఈ యాప్ నుంచి ర‌క్షించాల‌ని పత్తి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భూక్యా చందు నాయక్(Bhukya Chandu Nayak) డిమాండ్ చేశారు. శ‌నివారం సంఘం ప్ర‌తినిధులతో క‌లిసి లింగాల ఘ‌న‌పురం మండ‌లం కుందారం గ్రామంలో ప‌త్తి(Cotton), వ‌రి(Paddy), మొక్క‌జొన్న పంట‌ల‌ను ప‌రిశీలించారు.

కొర్రిలు పెట్టే ప్ర‌మాదం..

ఈ సంద‌ర్బంగా చందునాయ‌క్ మాట్లాడుతూ క‌పాస్ కిసాన్ యాప్‌(Kapas Kisan App)తో కౌలు రైతుకు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌న్నారు. ఈ యాప్‌లో భూమి ప‌ట్టాదారులు మాత్ర‌మే ఉంటార‌ని, కౌలు రైతుల న‌మోదు ఉండ‌ద‌న్నారు. దీంతో పండించిన ప‌త్తిపంట‌ను కౌలు రైతు అమ్ముకోవాలంటే భూమి ప‌ట్టాదారు వ‌ద్ద‌కు వెళ్ళాల‌ని, దీంతో ప‌ట్టాదారులు కొర్రిలు పెట్టే ప్ర‌మాదం ఉంద‌న్నారు. దీంతో కౌలు రైతులకు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని ఆవేధ‌న చెందారు. ఈ క‌పాస్ కిసాన్ యాప్‌ను తొల‌గించి నేరుగా ప‌త్తిని రైతులు ఇష్టం వ‌చ్చిన మిల్లులో అమ్ముకునే వెసులుబాటు ఇవ్వాల‌ని అన్నారు.

Also Read: Gadwal District: ధర్మవరం బిసి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. 52 మంది విద్యార్థులకు అస్వస్థత

న‌ల్ల‌గా మారిన ప‌త్తి..

మొంథా తుఫాన్‌తో జిల్లా వ్యాప్తంగా 32వేల ఎక‌రాల్లో పంట‌లు దెబ్బ‌తిన్నాయ‌ని అన్నారు. ఇప్ప‌టికి ఇంకా అనేక పంట‌లు నీటిలోనే ఉన్నాయ‌ని, దీంతో పంటంతా న‌ల్ల‌గా మారింద‌న్నారు. ప‌త్తి పంట రంగు మారింద‌న్నారు. మొక్క‌జొన్న‌, వ‌రి ధాన్యం మొల‌కెత్తుతున్నాయ‌ని అన్నారు. న‌ల్ల‌గా మారిన ప‌త్తిని సీసీఐ(CCI) అధికారులు మ‌ద్ద‌తు ధ‌ర‌కు కొనేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. పంట న‌ష్ట‌పోయిన రైతుల‌కు నష్టపరిహారం అందించాలని కోరారు. వరికి ఎక‌రాకు రూ.40వేలు, ప‌త్తికి రూ.60వేలు, మొక్క‌జొన్న‌కు రూ.30వేల చొప్పున న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం పంట భీమా ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌న్నారు. యాసంగి సీజ‌న్‌లోపే ప‌రిహారం అందేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు.

Also Read: Tata Bike – Fact Check: టూవీలర్ రంగంలోకి టాటా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ తరహాలో కొత్త బైక్స్.. ఇందులో వాస్తవమెంత?

Just In

01

Thummala Nageswara Rao: చేనేత కార్మికులకు పని కల్పించడమేప్రభుత్వ లక్ష్యం : మంత్రి తుమ్మల!

Pawan Kalyan: పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెడితే బావుంటుంది.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

Drishyam 3: మళ్ళీ వస్తున్న విజయ్ సల్గాంకర్.. ‘దృశ్యం 3’ అధికారిక ప్రకటన వచ్చేసింది

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?

Kavitha: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనం బాట : ఎమ్మెల్సీ కవిత!