New Business Survey: భారత ప్రభుత్వం ప్రథమంగా చిన్న వ్యాపారాల్లో డిజిటల్ వినియోగాన్ని సిస్టమాటిక్గా కొలవడానికి సిద్ధమవుతోంది. కొత్త ఫ్రేమ్వర్క్ తో ఈ వ్యాపారాల ఈ-కామర్స్ కార్యకలాపాలు, సోషల్ మీడియా వినియోగం, UPI చెల్లింపులు, డిజిటల్ అకౌంట్స్ నిర్వహణ వంటి అంశాలను ట్రాక్ చేయనుంది. ఇది అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ యొక్క వార్షిక సర్వే (Annual Survey of Unincorporated Sector Enterprises) (ASUSE)లో, 2026 జనవరి నుంచి ప్రారంభం కానుంది.
MoSPI విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఈ సర్వే దేశంలోని ఇన్ ఫార్మల్ వ్యాపారాల సాంకేతిక, లావాదేవీలను సిస్టమాటిక్గా లెక్కిస్తాయి. ఇవి భారతంలో వ్యవసాయేతర ఆర్థిక కార్యకలాపాల్లో పెద్ద భాగం కాబట్టి, ప్రభుత్వానికి ఈ డేటా అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. పాత సర్వేలలో ఎక్కువగా ఉద్యోగం, స్థిర ఆస్తులు, ఆపరేషనల్ మెట్రిక్స్ నే దృష్టిలో పెట్టేవి, డిజిటల్ వినియోగంపై పరిమిత ప్రశ్నలు మాత్రమే ఉండేవి.
ఈ సర్వేలో డిజిటల్ చెల్లింపుల విభాగం విస్తరించబడింది. UPI, PoS డివైసులు, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఉపయోగిస్తున్నారా, ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నాయా, డిజిటల్ అకౌంట్స్ నిర్వహిస్తున్నారా, యాప్-ఆధారిత మార్కెట్ప్లేస్లను ఉపయోగిస్తున్నారా అనే అంశాలను రికార్డ్ చేస్తారు. ఈ డేటా తో చిన్న వ్యాపారాలు ఫార్మల్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఎలా చేరుకుంటున్నాయో ప్రభుత్వం స్పష్టంగా తెలుస్తోంది.
త్వరలో రాబోతున్న కొత్త ఫ్రేమ్వర్క్ విధానం
కొత్త ASUSE ఫ్రేమ్వర్క్ వ్యాపార నిర్మాణాన్ని మరింత లోతుగా కొలుస్తుంది. వ్యాపారాలు యాజమాన్య రకం, GST రిజిస్ట్రేషన్ స్థితి, శాశ్వత కార్యకలాపాలు, వర్కింగ్ క్యాపిటల్ మూలాలు, ఇన్పుట్ అవుట్ ఫుట్ వివరాలు అందించాల్సి ఉంటుంది.
గత జూలై–సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో, రెండు వ్యాపారాల్లో ఒక్క వ్యాపారం ఆన్లైన్ టూల్స్ను ఉపయోగిస్తున్నట్టు రికార్డ్ అయ్యింది. ఇది సంవత్సర ప్రారంభంలో ఉన్న 34% కంటే పెరిగింది. 2025 నుండి MoSPI కూడా ఇన్ఫార్మల్ వ్యాపారాలపై త్రైమాసిక డేటా విడుదల చేస్తోంది, దీని వల్ల ఈ రంగాన్ని త్వరితంగా, సమయోచితంగా విశ్లేషించవచ్చు.

