Pakistan
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Blast in Match: ఉగ్రవాద సంస్థలకు స్వర్గధామమైన పాకిస్థాన్‌లో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. వాయువ్య పాక్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లో పేలుడు (Blast in Match ) సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు వెల్లడించారు. బజౌర్ జిల్లా ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ పేలుడు జరిగింది. ఐఈడీని (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) ఉపయోగించి పేలుడు జరిపారని బజౌర్ జిల్లా పోలీసు అధికారి వక్వాస్ రఫీక్వ్ ధృవీకరించారు.

గాయపడినవారిలో పిల్లలు కూడా ఉన్నారని, గాయాలపాలైనవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ పేలుడు ఉద్దేశపూర్వకంగా జరిపిందేనని అనుమానం వ్యక్తం చేశారు. లక్షిత దాడిగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. అనుమానిత మిలిటెంట్లు స్థానిక పోలీస్ స్టేషన్‌పై కూడా దాడికి యత్నించినట్టు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ ప్రయత్నం విఫలమైందని తెలిపాయి.

Read Also- Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

కాగా, పాకిస్థాన్‌లో క్రికెట్ మైదానాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు జరపడం ఇదే తొలిసారి కాదు. కొన్ని ముఖ్యమై ఘటనలను పరిశీలిస్తే, 2009లో శ్రీలంక క్రికెట్ జట్టు మీద లాహోర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఆ ఏడాది మార్చి 3న, గడాఫీ స్టేడియానికి ఆటగాళ్లు బస్సుపై బయలుదేరగా, ఉగ్రవాదులు ఆ బస్సుపై కాల్పులు జరిపారు.ఈ దాడిలో ఐదుగురు ప్లేయర్లకు స్వల్ప గాయాలయ్యాయి. నాటి కెప్టెన్ మహేల జయవర్ధనే, వైస్ కుమార సంగక్కర, అజంతా మెండిస్, థిలాన్ సమరవీర, తరంగ పరవితరణ వంటి ఆటగాళ్లు ఈ దాడిలో గాయపడ్డారు.

Read Also- Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే

పాకిస్థాన్-జింబాబ్వే వన్డే మ్యాచ్ లక్ష్యంగా కూడా ఉగ్రదాడి జరిగింది. గడాఫీ స్టేడియానికి వెలుపల ఈ ఘటన జరిగింది. అంతేకాదు, 2023లో క్వెట్టాలో పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ సమీపంలో పేలుడు సంభవించింది. నవాబ్ అక్బర్ స్టేడియానికి అతి సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారు. ప్రముఖ క్రికెటర్లు బాబర్ అజామ్, షాహిద్ అఫ్రిదీలను తక్షణమే సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ దాడికి టీటీపీ (Tehreek-e-Taliban Pakistan) బాధ్యత వహించింది.

Read Also- Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!