తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Fake Cotton Seized: తెలంగాణలో నిషేధించిన 75 లక్షల రూపాయల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను మేడ్చల్ జోన్ ఎస్వోటీ అధికారులు శామీర్ పేట పోలీసులతో కలిసి పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. మేడ్చల్ జోన్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల వాస్తవ్యుడైన సొల్లు సురేశ్, వృత్తిరీత్యా డ్రైవర్ అయిన సిరిమిల్ల నరేష్ ను కర్ణాటక రాష్ర్టం కుష్టగీ వెళ్లి రమణ అనే వ్యక్తి వద్దకు వెళ్లి అతను ఇచ్చే పత్తి విత్తనాలను తీసుకు రావాలని చెప్పాడు.
Also read: Betting Apps: బాలకృష్ణ అన్స్టాపబుల్ షో.. రూ. 80 లక్షలు నష్టపోయిన బెట్టింగ్ బాధితుడు
ఈ పని చేసి పెడితే 50వేల రూపాయలు ఇస్తానన్నాడు. దీనికి అంగీకరించిన నరేష్ తన సొంత డీసీఎం తీసుకుని కుష్టగీ వెళ్లాడు. అక్కడ రమణ కొద్దిసేపు వేచి ఉండమని నరేష్ తో చెప్పి డీసీఎం తీసుకుని వెళ్లాడు. ఆ తరువాత మన రాష్ట్రంలో నిషేధించిన బీజీ 3 రకానికి చెందిన 3,750 కిలోల పత్తి విత్తనాలను డీసీఎం వ్యాన్ లో లోడ్ చేసి నరేష్ కు ఇచ్చాడు. అక్కడి నుంచి బయల్దేరిన నరేష్ మంచిర్యాలకు బయల్దేరాడు.
Also read: Kaloji Narayana Rao University: ఫలించిన ‘స్వేచ్ఛ’ కృషి .. వీసీని మార్చిన ప్రభుత్వం
బుధవారం రాత్రి ఓఆర్ఆర్ నుంచి తూముకుంట గ్రామానికి వెళ్లే రోడ్డులోకి రాగానే మేడ్చల్ జోన్ ఎస్వోటీ అధికారులు శామీర్ పేట పోలీసులతో కలిసి డీసీఎం వ్యాన్ ను పట్టుకున్నారు. నరేష్ ను అరెస్ట్ చేశారు. మొత్తం 150 బ్యాగుల్లో ఉన్న పత్తి విత్తనాలను సీజ్ చేశారు. పరారీలో ఉన్న సురేశ్, రమణల కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నరేష్ పై శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్వోటీ డీసీపీ డీ.శ్రీనివాస్, అదనపు డీసీపీ విశ్వప్రసాద్ ల పర్యవేక్షణలో పేట్ బషీరాబాద్ ఏసీపీ కే.రాములు, సీఐలు శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనాథ్ తదితరులు దాడిలో పాల్గొన్నారు.
స్వేచ్ఛ E -పేపర్ కోసం ఈ లింక్ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/