Medchal District: బాచుపల్లి భూములకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. విస్తరిస్తున్న మహ నగరానికి సమీపంలో అన్ని సౌకర్యాలతో ఔటర్ రింగ్ రోడ్డు(ORR) కు అనుసందానంగా, పేరుగాంచిన ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండటంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు బాచుపల్లిలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉంది. దాంతో కొందరు అక్రమార్కులు బాచుపల్లిలో ఉన్న సీలింగ్ భూములపై కన్నేశారు. ఇలాగైనా ఈ భూములను కోట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. కోడూరు వెంకటరామయ్య అనే వ్యక్తి బాచుపల్లిలో 1966లో కోనుగోలు చేసిన మెత్తం 116 ఎకరాల భూమి ప్రభుత్వం 1975లో సీసీ నెంబర్ 702 /M/75 ద్వారా సీలింగ్ భూమిగా డిక్లేర్ చేసింది. అప్పటి నుండి ఈ భూములు తమకు తిరిగి కేటాయించాలని కోడూరు వెంకట్రామయ్య ఆతని సోదరుల వారసులు అప్పటిక నుండి ల్యాండ్ ట్రిబ్యునల్ కోర్టులో LRA 1/2021, WP 7833/2025,14125/2025 ద్వార న్యాయపోరాటం చేస్తున్నారు.
1966లో డాక్యుమెంట్
అయితే ఈవేమి పట్టని స్థానికంగా ఉన్న కొంతమంది కుల రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీలతో కలిసి ఈ భూములపై కన్నేశారు.చాల వరకు భూములను ఇప్పటికే కజ్జా చేశారు. సీలీంగ్ రికార్డులను తారుమారు చేసి తమ పేర్ల పై రికార్డులో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వ్యహరంలో కీలక పాత్ర, సూత్ర దారులు గా రెవన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. బాచుపల్లి సర్వేనెంబర్ 83 లో మెత్తం 17 ఎకరాల 30 గుంతల భూమి ఉంది. ఈ భూమిలో 1966లో డాక్యుమెంట్ నెంబర్ 157/ 1966 ద్వారా నిమ్మగడ్డ శ్రీరామనాథం 5 ఎకరాల 10 గుంటల భూమిని కొనుగోలు చేశారు.. 164 /1966 డాక్యుమెంట్ ద్వారా 6 ఎకరాల 35 గుంటల భూమిని వేములపల్లి కృష్ణమూర్తి, 165/1966 డాక్యుమెంట్ ద్వారా 5 ఎకరాలు 25 గుంటల భూమిని కోడూరు వెంకటరామయ్య పట్టాదారు అయిన నవాబ్ జుల్ఫికర్ అలీ సాబ్ నుండి కొనుగోలు చేశారు.
భవిష్యత్తులో లీగల్ గా ఇబ్బందులు
1966లో రిజిస్ట్రేషన్ ద్వారా అమ్మిన భూములు తిరిగి తమకు 1976లో అమ్మారని చూపుతూ నకిలీ సాదా బైనమా దస్తావేజులు తయారు చేసుకొని 83 సర్వే నెంబర్ లో ఉన్న 83/A సబ్ డివిజన్ సీలింగ్ భూమిని ఖయ్యూం అనే వ్యక్తి పేరు మీదకి A/3062/89 13 (B) ద్వార బదయించారు. కోడూరు వెంకట్రామయ్య వీల్ డీడ్ 37/1978 ప్రకారం రికార్డులో ఉన్న కేల్ కిషోర్ కుమార్ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. భవిష్యత్తులో లీగల్ గా ఇబ్బందులు తల్లేతే అవకాశం ఉందని ఖయ్యూం ద్వారా ఈ భూమిని ఇతరులకు బదలాయించారు. లీగల్ గా లోసుగులు తెలుసుకున్న మైరాన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్యాండ్యూయర్ డెవలపర్స్ బిల్డర్స్ తమకు అధికార పార్టీతో మంచి పలుకుబడి ఉందని తాము లీగల్ గా అన్ని సెటిల్ చేసుకుంటామని ఈ సీలీంగ్ భూమిలోకొంత భాగాన్ని డెవలప్మెంట్ కోసం, మిగిలిన దాన్ని నేరుగా కొనుగోలు చేసాయి..సీలింగ్ భూమి హద్దులతో తమకు అనుమతులు రావని గ్రహించి పక్కనే ఉన్న ఇతర పట్టాదారుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
Also Read: Vinayaka Chavithi 2025: వినాయకుడి మండపాన్ని ఎలా అలంకరించాలో తెలియట్లేదా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
మైరాన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
విషయం తెలుసుకున్న నిమ్మగడ్డ శ్రీరామనాథం వారసులు తాము గతంలో అమ్మిన 2 ఎకరాల 11 గంటల భూమి పోను 2 ఎకరాల 39 గుంటలను తమ పేరు మీది. ఈ మధ్యే ఖుత్బూలపూర్ సబ్ రిజిస్టార్ అపీసులో గిఫ్ట్ డీడ్ గా మార్చుకున్నారు..దాంతో ఎలాగైనా లీగల్ సమస్యలు తల్లేతే అవకాశం ఉందని గ్రహించిన మైరాన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్యాండ్యూయర్ డెవలపర్స్ నిమ్మగడ్డ వారసులు చేసుకున్నగిఫ్ట్ డీడ్ తప్పుగా చేశారని ఎలాగైనా దాని రద్దూ చేయాలని అధికారలపై ఓత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో గిఫ్ట్ డీడ్ చేసిన సబ్ రిజిస్టార్ పై స్టాంప్స్ అండ్ ఐజీ కి పిర్యాదు చేయించి వాళ్లు సీలీంగ్ బాగోతం బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. రెవెన్యూ అధికారుల మాత్రం ఇంత జరుగుతున్న సీలింగ్ భూముల వ్యవహారంలో ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.. నిజమైన పటాదారుల వద్ద ఉన్న డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్లుగా చూపుతున్నారు.. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
2019 అర్డీఓ అర్డర్ ప్రకారం
కలెక్టర్ లేటర్ G2/13526/2024 ప్రకారం 133-19 ఎకరాలు ప్రోబిషన్ (22ఎ) లో పెట్టారు. ఈ ప్రోబిషక్ మాకు వర్తించదు. ఇది కోడూరి వెంకటరామయ్య వారసుల LRA 1/ 2021 కు సంబందించింది. సి.సి నెంబర్ 702/M/75 ప్రకారం 83 సర్వె నెంబర్ లో 5 ఎకరాల 25 గుంటల భూమి సీలీంగ్ లో ఉండాలి. 2019 అర్డీఓ అర్డర్ ప్రకారం 83 సర్వే నెంబర్ లో సీలీంగ్ భూమి లేదు అన్నట్లు చూపించారు. మేము మా భూమి పూర్తిగా అమ్మేశాం అంటున్నారు. మా నాల కన్వర్షన్ ఫేక్ అంటున్నారు. మాకు ఇప్పటి వరకు ఎలాంటి నొటీసులు రాలేదు. వస్తే లీగల్ గా ఎదుర్కొంటాం హద్దుల వ్యవహరం బయటక వస్తుందని డ్యాకుమెంట్ 165/1966 , 157/1966 ని సబ్ రిజిస్టార్ కార్యలయంలో తోలగించారు. నకిలీ A/3062/89 13(B) ప్రోసిగిండ్ తో సీలీంగ్ భూమిని పట్టాగా మార్చుకున్నారు. ఈ వ్యవహరం పూర్తిగా రెవన్యూ , స్టాంప్ అండ్ రిజిస్టేషన్ అధికారుల కన్నుసన్నలో నడుస్తుంది. ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా విచారణ జరిపించాలని అన్నారు.
Also Read: Pollution Check Vehicles: పొల్యూషన్ చెకింగ్ వాహన నిర్వాహకుల ఇష్టారాజ్యం.. అక్రమంగా ఫీజుల వసూళ్లు
