Expand Dog Squad (imagecreit:swetcha)
హైదరాబాద్

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Expand Dog Squad: హైదరాబాద్ కమిషనరేట్​ పరిధిలో డాగ్ స్క్వాడ్​ ను విస్తరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 34 పోలీసు జాగిలాలకు అదనంగా మరో 20 శునకాలను స్క్వాడ్​ లో చేర్చనున్నారు. ఇంటిగ్రేటెడ్​ ఇంటెలిజెన్స్​ ట్రైనింగ్​ అకాడమీ(Integrated Intelligence Training Academy)లో వీటికి శిక్షణ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ పూర్తయిన తరువాత డాగ్ స్క్వాడ్(Dog Squad) లోకి చేర్చుకోనున్నారు. దోపిడీ.. దొంగతనం.. హత్యలు.. బాంబు బెదిరింపులు.. ఇలా ఏ నేరం జరిగినా వాటి పరిష్కారంలో పోలీసు జాగిలాలు కీలకపాత్ర వహించే విషయం అందరికీ తెలిసిందే. క్లూస్​ టీంతోపాటు నేర స్థలానికి వచ్చే ఈ జాగిలాలు వాసన ద్వారా అనుమానితులను పసిగడుతుంటాయి.

కొత్తగా మరో 20 జాగిలాలు

ప్రస్తుతం హైదరాబాద్(Hyderabada) సిటీ పోలీస్ లో 34 జాగిలాలతో డాగ్ స్క్వాడ్​ పని చేస్తోంది. అయితే, నేరాల సంఖ్య పెరిగిపోతుండటంతో వీటిపై పని భారం అధికమవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీస్​ కమిషనర్ సీ.వీ.ఆనంద్(CV Ananadh) డాగ్ స్క్వాడ్ ను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కొత్తగా మరో 20 జాగిలాలను స్క్వాడ్ లో చేర్చనున్నారు. దీని కోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్న డాగ్​ బ్రీడర్ల నుంచి నాణ్యమైన శునకాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 12 జాగిలాలను ఎంపిక చేశారు కూడా. వీటికి ఇంటిగ్రేటెడ్​ ఇంటెలిజెన్స్​ ట్రైనింగ్​ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు.

Also Read: Tragic Incident: గద్వా ల జిల్లా దారుణం.. ఉపాధి కోసం వెళ్లి విగత జీవులుగా మారిన దంపతులు?

11.5 ఎకరాల్లో డాగ్​ కెన్నెల్..

డాగ్ స్క్వాడ్ లోని జాగిలాల కోసం 11.5 ఎకరాల విస్తీర్ణంలో డాగ్​ కెన్నెల్(Dog kennel) ఏర్పాటు చేయనున్నారు. గోషామహల్​ పోలీస్​ స్టేడియం స్థలాన్ని కొంతకాలం క్రితం ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్థలంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్టేడియంలోని గుర్రపు శాల, మైదానంతోపాటు సిటీ సెక్యూరిటీ వింగ్​ భవనాలను ప్రత్యామ్నాయంగా ఇచ్చిన స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులను కూడా మంజూరు చేసింది. ఈ స్థలంలోనే డాగ్ కెన్నెల్​ తోపాటు మౌంటెడ్​ దళంలో ఉన్న గుర్రాల కోసం కొత్తగా అశ్వశాలను ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ ఆనంద్​ చెప్పారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈనెల 8న పూర్తి చేయనున్నట్టు తెలిపారు.

Also Read: Vijaya Rama Rao: కన్నతండ్రి కేసీఆర్‌పై కవిత ఒత్తిడి.. అందుకే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్?

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?