Hyderabad Tragedy: శంషాబాద్‌లో తీవ్ర విషాదం
Hyderabad Tragedy (Image Source: Twitter)
హైదరాబాద్

Hyderabad Tragedy: కడుపులోనే కవలలు మృతి.. కాసేపటికే భార్య మరణం.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే?

Hyderabad Tragedy: ఆ జంట పెద్దలు కుదిర్చిన వివాహంతో ఒక్కటయ్యింది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆ జంటను ఒక సమస్య మాత్రం ఎంతగానో బాధిస్తూ వచ్చింది. పెళ్లై ఏడేళ్లు దాటినా సంతానం లేకపోవడంతో వారిద్దరు ఎంతగానో కుమిలిపోయారు. చివరికీ భార్య గర్భం దాల్చడంతో ఆ భర్త ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పైగా పుట్టబోయేది కవలలు అని తెలిసి ఇంకాస్త మురిసిపోయాడు. అయితే ఆ జంట ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది. కొన్ని ఊహించని పరిణామాల అనంతరం కడుపులోని కవలలు సహా.. భార్య, భర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

అసలేం జరిగిందంటే?

కడప జిల్లా రైల్వే కోడూరికి చెందిన ముత్యాల విజయ్ (40) హైదరాబాద్ లో జీవిస్తున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తూ భార్య శ్రావ్యతో కలిసి సామ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్నాడు. ఏడేళ్లు అయినా పిల్లలు లేకపోవడంతో విజయ్ – శ్రావ్య జంట వైద్యులను సంప్రదించారు. దీంతో ఐవీఎఫ్ విధానం ద్వారా 8 నెలల క్రితం శ్రావ్య గర్భం దాల్చింది. కడుపులో కవలలు పెరుగుతున్నారని తెలిసి.. ఆ జంట ఎంతగానో సంతోషించింది.

కడుపు నొప్పి రావడంతో..

8 నెలల గర్భంతో ఉన్న శ్రావ్యకు ఆదివారం ఒక్కసారిగా కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. దీంతో తల్లితో కలిసి ఆమె అత్తాపూర్ లోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. విషయం తెలిసి విజయ్ కూడా హూటాహుటీనా ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడే విజయ్ కు ఓ షాకింగ్ విషయం తెలిసింది. కడుపులోని కవలలు చనిపోయారని వైద్యులు అతడికి చెప్పారు. దీంతో ఒక్కసారిగా మనస్తాపానికి గురైన విజయ్.. ఆస్పత్రి నుంచి కోపంతో బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే శ్రావ్యకు కూడా సీరియస్ కావడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని అత్త సరోజిని విజయ్ కు తెలియజేసింది. విజయ్ అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే చికిత్స పొందుతూ భార్య శ్రావ్య కూడా ప్రాణాలు విడిచింది.

Also Read: BRS vs Kavitha: గులాబీకి రాజకీయ ప్రత్యర్థిగా ఇక జాగృతి.. కవిత టార్గెట్‌గా బీఆర్ఎస్ అస్త్రాలు సిద్ధం

భర్త విజయ్ కూడా..

తొలుత కవల పిల్లలు, కాసేపటికి భార్య చనిపోవడంతో భర్త విజయ్ తట్టుకోలేకపోయాడు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. శంషాబాద్ లోని ఇంటికి వచ్చేశారు. అయితే ఆస్పత్రిలో విగతజీవిగా ఉన్న భార్యను డిశ్చార్జ్ చేసేందుకు విజయ్ సంతకం వైద్యులకు అవసరమైంది. దీంతో కుటుంబ సభ్యులు.. విజయ్ కు ఫోన్ చేశారు. ఎన్ని సార్లు చేసినా స్పందించకపోవడంతో విజయ్ ఉంటున్న ఇంటికి వచ్చి చూశారు. ఇంటి గది తెరిచి చూడగా విజయ్ ఊరివేసుకొని కనిపించాడు. భార్య, పిల్లలను కోల్పోవడంతో మనస్థాపానికి గురై విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: SS Rajamouli: రాజమౌళి పై కేసు నమోదు.. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్న వానరసేన?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?