Hyderabad Tragedy: ఆ జంట పెద్దలు కుదిర్చిన వివాహంతో ఒక్కటయ్యింది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆ జంటను ఒక సమస్య మాత్రం ఎంతగానో బాధిస్తూ వచ్చింది. పెళ్లై ఏడేళ్లు దాటినా సంతానం లేకపోవడంతో వారిద్దరు ఎంతగానో కుమిలిపోయారు. చివరికీ భార్య గర్భం దాల్చడంతో ఆ భర్త ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పైగా పుట్టబోయేది కవలలు అని తెలిసి ఇంకాస్త మురిసిపోయాడు. అయితే ఆ జంట ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది. కొన్ని ఊహించని పరిణామాల అనంతరం కడుపులోని కవలలు సహా.. భార్య, భర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
అసలేం జరిగిందంటే?
కడప జిల్లా రైల్వే కోడూరికి చెందిన ముత్యాల విజయ్ (40) హైదరాబాద్ లో జీవిస్తున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తూ భార్య శ్రావ్యతో కలిసి సామ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్నాడు. ఏడేళ్లు అయినా పిల్లలు లేకపోవడంతో విజయ్ – శ్రావ్య జంట వైద్యులను సంప్రదించారు. దీంతో ఐవీఎఫ్ విధానం ద్వారా 8 నెలల క్రితం శ్రావ్య గర్భం దాల్చింది. కడుపులో కవలలు పెరుగుతున్నారని తెలిసి.. ఆ జంట ఎంతగానో సంతోషించింది.
కడుపు నొప్పి రావడంతో..
8 నెలల గర్భంతో ఉన్న శ్రావ్యకు ఆదివారం ఒక్కసారిగా కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. దీంతో తల్లితో కలిసి ఆమె అత్తాపూర్ లోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. విషయం తెలిసి విజయ్ కూడా హూటాహుటీనా ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడే విజయ్ కు ఓ షాకింగ్ విషయం తెలిసింది. కడుపులోని కవలలు చనిపోయారని వైద్యులు అతడికి చెప్పారు. దీంతో ఒక్కసారిగా మనస్తాపానికి గురైన విజయ్.. ఆస్పత్రి నుంచి కోపంతో బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే శ్రావ్యకు కూడా సీరియస్ కావడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని అత్త సరోజిని విజయ్ కు తెలియజేసింది. విజయ్ అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే చికిత్స పొందుతూ భార్య శ్రావ్య కూడా ప్రాణాలు విడిచింది.
Also Read: BRS vs Kavitha: గులాబీకి రాజకీయ ప్రత్యర్థిగా ఇక జాగృతి.. కవిత టార్గెట్గా బీఆర్ఎస్ అస్త్రాలు సిద్ధం
భర్త విజయ్ కూడా..
తొలుత కవల పిల్లలు, కాసేపటికి భార్య చనిపోవడంతో భర్త విజయ్ తట్టుకోలేకపోయాడు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. శంషాబాద్ లోని ఇంటికి వచ్చేశారు. అయితే ఆస్పత్రిలో విగతజీవిగా ఉన్న భార్యను డిశ్చార్జ్ చేసేందుకు విజయ్ సంతకం వైద్యులకు అవసరమైంది. దీంతో కుటుంబ సభ్యులు.. విజయ్ కు ఫోన్ చేశారు. ఎన్ని సార్లు చేసినా స్పందించకపోవడంతో విజయ్ ఉంటున్న ఇంటికి వచ్చి చూశారు. ఇంటి గది తెరిచి చూడగా విజయ్ ఊరివేసుకొని కనిపించాడు. భార్య, పిల్లలను కోల్పోవడంతో మనస్థాపానికి గురై విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య..
శంషాబాద్ లో తీవ్ర విషాదం
ఎయిర్ పోర్టులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న బెంగళూరు నివాసి ముత్యాల విజయ్ (40)
ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన విజయ్ భార్య శ్రావ్య
కళ్లు తెరక ముందే గర్భంలో కవలల మృతి
చికిత్స పొందుతూ శ్రావ్య కూడా మృతి
దీంతో… pic.twitter.com/FX0wyG5QqI
— BIG TV Breaking News (@bigtvtelugu) November 18, 2025

