GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వ్యాపార సంస్థలు 2026 సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్సులను డిసెంబర్ 20 లోపు ఎలాంటి పెనాల్టీ లేకుండా రెన్యూవల్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ (GHMC) వ్యాపారులకు సూచించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రెన్యూవల్ కోసం నిర్ణయించిన గడువు 20 లోపు రెన్యూవల్ చేసుకుంటే ఎలాంటి జరిమానా ఉండదని స్పష్టం చేసింది.
Also Read: GHMC: బల్దియా చరిత్రలో తొలిసారి 13 వేల కోట్ల పైచిలుకు బడ్జెట్.. నెక్స్ట్ ప్లాన్ ఇదే..!
ట్రేడ్ లైసెన్స్ ఫీజులో 50 శాతాన్ని పెనాల్టీ
గడువు దాటిన తర్వాత రెన్యూవల్ చేసే ట్రేడ్ లైసెన్సులకు జీహెచ్ఎంసీ పెనాల్టీలను ఖరారు చేసింది. 21 తర్వాత రెన్యూవల్ చేసుకునే ట్రేడ్ లైసెన్సులకు చెల్లించాల్సిన మొత్తం ట్రేడ్ ఫీజులో 25 శాతం పెనాల్టీ చెల్లించాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఇక ఫిబ్రవరి 20 తర్వాత రెన్యూవల్ చేసుకునే ట్రేడ్ లైసెన్సులకు చెల్లించాల్సిన మొత్తం ట్రేడ్ లైసెన్స్ ఫీజులో 50 శాతాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుందని బల్దియా స్పష్టం చేసింది.
Also Read: GHMC: గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణగా జీహెచ్ఎంసీ స్టాల్స్!

