హైదరాబాద్

Hyderabad Police: మద్యం త్రాగి, బండి నడిపి.. ఇంత మంది పట్టుబడ్డారేంటి?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Hyderabad Police: డ్రంకెన్​ డ్రైవ్​ పై సైబరాబాద్​ పోలీసులు స్పెషల్​ డ్రైవ్​ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి కమిషనరేట్​ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో పీకలదాకా మద్యం సేవించి వాహనాలు నడిపిన 389మంది పట్టుబడ్డారు. రోడ్డు ప్రమాదాలతోపాటు కొందరు ప్రాణాలు పోగొట్టుకోవటానికి కారణమవుతున్న డ్రంకెన్​ డ్రైవ్​ ను అరికట్టటానికి మూడు వారాలుగా సైబరాబాద్​ పోలీసులు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

Also read: Telangana Govt: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉగాది నుండి కొత్త పథకం ప్రారంభం..

ప్రతీ శనివారం రాత్రి కమిషనరేట్​ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి నడుపుతున్న వారిని పట్టుకుంటున్నారు. ఈ శనివారం రాత్రి కూడా మందు కొట్టి డ్రైవింగ్ చేసిన 315మంది ద్విచక్ర వాహనదారులు, 13 ఆటోవాలాలు, 59మంది కారు డ్రైవర్లు, ఇద్దరు భారీ వాహనాల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 26మందికి పరీక్షలు జరుపగా వారి రక్తంలో ఆల్కహాల్​ శాతం 10‌‌0 నుంచి 500 మిల్లీలీటర్లు ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది.

Also read: KTR Comments: కేసీఆర్ మంచివారే.. నేను కాదు.. కేటీఆర్

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిన అందరినీ ఆయా కోర్టుల్లో హాజరు పరచనున్నట్టు సైబరాబాద్​ కమిషనర్​ అవినాష్​ మహంతి తెలిపారు. తాగిన మత్తులో డ్రైవింగ్​ చేస్తూ ఎవరివైనా ప్రాణాలు పోవటానికి కారణమైతే నిందితులపై బీఎన్​ఎస్​ సెక్షన్​ 105 ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కేసుల్లో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు.

స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?