Gold Rates (05-07-2025): ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే, దేశంలో ఆర్థిక సమస్యల పెరుగుదలతో కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి. ధరలు పెరిగితే కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ధరలు తగ్గితే మాత్రం బంగారం కొనేందుకు జనం ఆసక్తి చూపుతారు. ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు తప్పనిసరి. శుభకార్యాల్లో మహిళలు బంగారు ఆభరణాలు ధరించి సంతోష పడతారు.
పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లి సీజన్లో బంగారం ధరలు కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,830 గా ఉంది. పెళ్లి సీజన్ ముగిసిన తర్వాత బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల కారణంగా ధరలు తగ్గవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Hyderabad Water Board: జలమండలి స్పెషల్ ఫోకస్.. నీటి చౌర్యం మీటర్ల ట్యాంపరింగ్లకు చెక్!
గత రెండు రోజుల నుంచి తగ్గుతూ, పెరుగుతూ ఉన్నప్పటికీ, నేడు బంగారం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 కి పెరిగి రూ.98,830 గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 కి పెరిగి రూ.90,600 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్లో బంగారం, వెండి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.98,830
విజయవాడ ( Vijayawada) – రూ.98,830
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.98,830
వరంగల్ ( warangal ) – రూ.98,830
24 క్యారెట్లు బంగారం ధర
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.90,600
వరంగల్ ( warangal ) – రూ.90,600
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.90,600
విజయవాడ – రూ.90,600
వెండి ధరలు
గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.14,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,20,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
విజయవాడ – రూ.1,20,000
విశాఖపట్టణం – రూ.1,20,000
హైదరాబాద్ – రూ.1,20,000
వరంగల్ – రూ.1,20,000
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.