Ambani-Adani: భారతదేశంలో సంపన్నుల గురించి ఆలోచిస్తే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani). ఆ తర్వాత అదానీ గ్రూపు కంపెనీల (Adani Groups) అధినేత గౌతమ్ అదానీ (Gautham Adani) గుర్తుకొస్తారు. ప్రతిరోజూ, ఇంకా చెప్పాలంటే ప్రతి గంటలోనూ వారి సంపద కోట్ల రూపాయల మొత్తంలో వృద్ధి చెందుతూనే ఉంటుంది. అయితే, శుక్రవారం మాత్రం వీరిద్దరి (Ambani-Adani) ఆస్తి విలువ భారీగా కరిగిపోయింది. ఏ స్థాయిలో అంటే, ముకేష్ అంబానీకి రూ.22,500 కోట్లు, అదానీకి రూ.24,277 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఇద్దరు వ్యాపార దిగ్గజాలకు ఇంతగానం నష్టం జరగడానికి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనమే ఏకైక కారణంగా ఉంది.
మార్కెట్లు క్రాష్.. భారీగా నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ రోజైన శుక్రవారం నాడు కూడా భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 605 పాయింట్లు పతనమయ్యి 83,576 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 సూచీ 193 పాయింట్లు క్షీణించి 25,683 పాయింట్ల వద్ద ముగిసింది. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్స్ జాబితాలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు, గౌతమ్ అదానీకి చెందిన కంపెనీల షేర్లు కూడా ఉన్నాయి. దీంతో వీరిద్దరూ భారీగా సంపద నష్టపోయారు.
పడిపోయిన ర్యాంకులు
శుక్రవారం ఒక్కరోజే కాకుండా, గత ఐదు రోజులుగా మార్కెట్లు నష్టాల్లో ముగుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పతనమవుతూనే ఉన్నాయి. ఈ ప్రభావంతో కంపెనీ చైర్మన్గా కంపెనీలో గణనీయమైన వాటా కలిగివున్న ముకేష్ అంబానీ వ్యక్తిగత సంపద కూడా గణనీయంగా తరిగిపోయింది. దీంతో ప్రపంచ టాప్-10 సంపన్నుల జాబితాలో ఆయన ఇప్పటికే చోటు కోల్పోయారు. శుక్రవారం నాటికి ఫోర్బ్స్ రియల్టైమ్ బిలియనీర్ల జాబితాలో 17వ స్థానంలో నిలిచారు. ఈ సూచీ ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ 106 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే, భారతీయ కరెన్సీలో రూ.9.55 లక్షల కోట్ల పైమాటే. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 2.5 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది.
ఇక, గౌతమ్ అదానీ విషయానికి వస్తే, ప్రపంచ టాప్-20 సంపన్నుల జాబితాలో చోటు కోల్పోయారు. మొత్తం 100 బిలియన్ డాలర్ల సంపదతో టాప్-28 స్థానంలో నిలిచారు. శుక్రవారం ఒక్క రోజే రూ.24,277 కోట్ల మొత్తం నష్టపోగా, ఫోర్బ్స్ రియల్టైమ్ సూచీ ప్రకారం, ప్రస్తుతం ఆయన నికర ఆస్తి విలువ రూ.5.75 లక్షల కోట్లుగా ఉంది. అదానీ గ్రూప్ ఇటీవలే బ్రెజిల్కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజ కంపెనీ ఎంబ్రాయిర్తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం, భారతదేశంలోనే విమానాలను తయారు చేయనున్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రకటనను త్వరలోనే హైదరాబాద్ వేదికగా జరగనున్న ‘హైదరాబాద్ ఎయిర్ షో’లో ప్రకటించనున్నట్టుగా కంపెనీ తెలిపింది.
Read Also- Yash Toxic: రికార్డులు తిరగరాస్తున్న యష్ ‘టాక్సిక్’ హీరో ఇంట్రో గ్లింప్స్.. 24 గంటల్లోనే అంతా..?

