AP Telangana Water Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పొరుగు రాష్ట్రాలతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో ఓ కంపెనీ తయారీ యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రేవంత్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ది చూడొద్దన్న సీఎం.. పంచాయతీల కంటే పరిష్కారం చూపడానికే తాను ఇష్టపడతానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన తమ ప్రాజెక్టుకు పక్క రాష్ట్ర సీఎం అడ్డుపడొద్దని హితవు పలికారు. తాను వివాదం కోరుకోవడం లేదని.. శాశ్వత పరిష్కారాన్నే ఆశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. మీకు పంచాయతీ కావాలా? నీళ్లు కావాలా? అంటే తాను నీటినే కోరుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
వివాదం కావాలా? పరిష్కారం కావాలా?
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్యూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వశర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు సీఎంతో పాటు ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వివాదం కావాలా? పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారమే కోరుకుంటానని చెప్పారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారు.
పొరుగు రాష్ట్రాలతో చర్చలకు నేను సిద్ధం: సీఎం రేవంత్
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘పొరుగు రాష్ట్రాలతో చర్చలకు నేను సిద్ధం. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ది చూడొద్దు. నీటి విషయంలో పంచాయితీ కంటే పరిష్కారానికే నేను ఇష్టపడతా. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన… pic.twitter.com/2RKsVMZ4F6
— ChotaNews App (@ChotaNewsApp) January 9, 2026
Also Read: DCM Pawan Kalyan: ‘సినిమా ఫ్లాప్ అయినా.. డబ్బు వచ్చే స్టార్ డమ్ నాది’.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ అడ్డంకులు పెట్టకండి’
ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. ‘కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టకండి. అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వ నిధులు రావడంలేదు. రాష్ట్రంపై ఆర్ధిక భారం పడుతోంది మేం వివాదం కోరుకోవడంలేదు.. పరిష్కారం కోరుకుంటున్నాం. రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలి. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయి’ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీతో పాటు పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలతోనూ పరస్పర సహకారాన్నే తాము కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.

