DCM Pawan Kalyan: పిఠాపురంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలు ఫ్లాప్ అయినా కలెక్షన్స్ వచ్చే శక్తి, స్టార్ డమ్ ఉన్న నటుడ్ని తానని వ్యాఖ్యానించారు. నల్గొండ ఫ్లోరోసిస్ లాంటి ఎన్నో సమస్యలు చూసి ఆవేదనకు గురై.. ఎంతో బాధ్యతతో రాజకీయాలకు వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోవైపు కూటమిలో చిచ్చుపెట్టాలని ప్రయత్నించే వారి కుట్రలను తిప్పికొట్టాలని పిఠాపురం వేదికగా జనసేన శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు.
గోదావరి యాసలో పవన్ డైలాగ్స్
పిఠాపురం నియోజకవర్గంలోని ఓ.బి.ఎస్. మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ‘పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలు’ శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల పాటు సంబురాలు జరగనుండగా తొలిరోజు పవన్ పాల్గొని మాట్లాడారు. ‘సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాలండి, కోడి పందాలండి, జూదాలండి’ అని అంటారని గోదావరి యాసలో పవన్ అన్నారు. అయితే వాటికే పరిమితం కాకూడదని పవన్ అభిప్రాయపడ్డారు. మన సంస్కృతి మూలాలను మర్చిపోకూడదని స్పష్టం చేశారు. మన అప్యాయత, అనురాగం, గంగిరెద్దులు, హరిదాసుల గురించి నలుగురూ చెప్పుకోవాలని పవన్ పేర్కొన్నారు.
గోదావరి యాసలో పవన్ డైలాగ్స్
సంక్రాంతి అంటే కోడి పందాలు, జూదాలు, పేకాటకే పరిమితం కాదు
మన సంస్కృతి మూలాలను మర్చిపోకూడదు
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడి పందాలు, కోట్ల రూపాయలు చేతులు మారతాయనే మాట భోగి మంటల్లో కలిపేయాలి
మన అప్యాయత, అనురాగం, గంగిరెద్దులు, హరిదాసుల గురించి… pic.twitter.com/fhDMVJWTs4
— BIG TV Breaking News (@bigtvtelugu) January 9, 2026
పిఠాపురం అభివృద్ధికి రూ.308 కోట్లు
పిఠాపురం గురించి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తొలి ఏడాదిలోనే రూ.308 కోట్లను నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి ఆ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. తాను పిఠాపురంలో ఉండటం కంటే.. తాను లేకపోయినా మీ పనులు పూర్తయ్యే వ్యవస్థ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని పవన్ అన్నారు. తాను ఉంటేనే అభివృద్ధి పనులు అవుతాయంటే.. దానిని పాలనా వైఫల్యంగానే తాను భావిస్తానని పవన్ పేర్కొన్నారు.
నేను నెంబర్ వన్ యాక్టర్ ని కాకపోవచ్చు
కానీ నా సినిమా ఫ్లాప్ అయినా డబ్బు సంపాదించగలిగే కెపాసిటీ నాకు ఉంది
– డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/u9uYQcH1jb
— BIG TV Breaking News (@bigtvtelugu) January 9, 2026
‘ప్రభుత్వం మారినా.. మార్పు రాలేదు’
గత ప్రభుత్వంలోని నాయకులు.. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టి రాజకీయం చేశారని పవన్ ఆరోపించారు. ప్రభుత్వం మారినా ఆ నాయకుల్లో మార్పు రాలేదన్నారు. ప్రజలు అలాంటి వారి మాటల్లో పడి వివాదాల్లోకి వెళ్లవద్దని పవన్ సూచించారు. తాను పిఠాపురంలో గెలిచి.. జాతీయ స్థాయిలో జనసేన పేరు వినబడేలా పనిచేస్తున్నట్లు చెప్పారు. కాబట్టి తనను పిఠాపురానికే పరిమితం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో జరిగే పేరంటాలకు, ఫంక్షన్లకు తాను అటెండ్ కావడం లేదని ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎక్కడ ఉన్నా పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే పనిచేస్తానని పవన్ స్పష్టం చేశారు.
బాబాయ్ గురైతే వార్త అవ్వదా?
పిఠాపురంలో ఇద్దరు చిన్న పిల్లలు మాటా మాటా అనుకుంటే దానిని పెద్ద వార్త చేసి.. తనను బాధ్యత వహించాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘పులివెందులలో సొంత బాబాయి హత్యకు గురైతే అది వార్త అవ్వదు. ఈ రోజుల్లో నాయకులే కొట్టుకుంటున్నారు. అలాంటిది స్కూల్లో ఇద్దరు పిల్లలు మాటా మాటా అనుకోకుండా ఉంటారా?’ అని పవన్ ప్రశ్నించారు. దానిని కూడా పెద్ద గొడవలాగా మార్చాలని ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Jagtial District: చైనా మాంజా ప్రమాదం.. మెడ కోసుకుపోయి.. బాలుడికి తీవ్ర గాయాలు
‘చంద్రబాబుతో విభేదాలు లేవు’
కూటమి ప్రభుత్వాన్ని బలహీనం చేసేలా ఎవరూ మాట్లాడవద్దని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హితవు పలికారు. తనకు, సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు మధ్య ఎలాంటి అభద్రతా భావం లేదన్నారు. ప్రజల కోసమే తాము పనిచేస్తున్నట్లు చెప్పారు. నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూటమి స్ఫూర్తి దెబ్బతీసేలా ఎవరూ ప్రవర్తించవద్దని పవన్ హితవు పలికారు. మరోవైపు జనసేన ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న ఎల్లప్పుడూ పిఠాపురం వేదికగానే జరుగుతుందని పవన్ అన్నారు. జనసేన పార్టీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి అయితే, ఐడియాలజికల్ హెడ్ క్వార్టర్స్ పిఠాపురంగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

