HYD Metro (Image source Twitter)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Hyderabad Metro: హైదరాబాదీలకు మెట్రో రైల్ బ్యాడ్‌న్యూస్.. సోమవారం నుంచే అమలు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్యాసింజర్లకు కాస్త నిరాశ కలిగించే నిర్ణయం ప్రకటించింది. సర్వీస్ టైమింగ్స్‌లో  కీలకమైన మార్పులు చేసింది. ఇప్పటివరకు మెట్రో సర్వీసులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటలకు మొదలయ్యి.. రాత్రి 11.45 గంటల వరకు కొనసాగేవి. అయితే, తాజాగా సమయ వేళల సవరణ ప్రకారం, రాత్రి 11 గంటలకే సర్వీసులు బంద్ అవుతాయి. చివరి ట్రైన్ రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది.

సవరించిన ఈ టైమింగ్స్‌ 2025 నవంబర్ 3 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారికంగా శనివారం ప్రకటించింది. అన్ని టర్మినల్ స్టేషన్లు, వారంలోని అన్ని రోజుల్లో ఇవే సమయ వేళలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మార్పులకు అనుగుణంగా ప్యాసింజర్లు తమ ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. తదుపరి నోటిసు వచ్చేంత వరకు ఈ టైమింగ్స్ కొనసాగుతాయని,  సేవల విషయంలో తమకు సహకరిస్తున్నందుకు ప్యాసింజర్లకు ధన్యవాదాలు అని పేర్కొంది.

Read Also- BCCI Cash Reward: వరల్డ్ కప్ గెలిస్తే నజరానాగా రూ.125 కోట్లు!.. ఉమెన్స్ క్రికెట్ టీమ్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న బీసీసీఐ

ప్రస్తుతం టైమింగ్స్ ఇలా..

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రస్తుత ఆపరేటింగ్ టైమింగ్స్‌ను పరిశీలిస్తే, శనివారం ఉదయం 6 గంటలకు సర్వీసులు ప్రారంభమై, రాత్రి 11 గంటలకు ముగుస్తాయి. మరుసటి రోజైన ఆదివారం ఒక గంట ఆలస్యంగా ఉదయం 7 గంటలకు సేవలు మొదలవుతాయి. కానీ, ముగింపు మాత్రం శనివారం మాదిరిగానే రాత్రి 11 గంటలకు చివరి సర్వీసు ఉంటుంది. ఇక సాధారన వర్కింగ్ డేస్‌, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటలకు సేవలు, మొదలై రాత్రి 11.45 గంటలకు ముగుస్తున్న విషయం తెలిసిందే.

Just In

01

Duddilla Sridhar Babu: వీఎఫ్‌ఎక్స్ గేమింగ్‌కు ప్రభుత్వం కో క్రియేటర్.. ఫ్యూచర్స్ ఫండ్ ఏర్పాటుకు మంత్రి శ్రీధర్ పిలుపు

Hyderabad Police: నార్త్‌జోన్‌లో నేరగాళ్లకు చెక్.. వేర్వేరు కేసులకు సంబంధించిన నిందితులను అరెస్ట్.. బంగారు నగలు, ఫోన్లు స్వాధీనం!

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకే.. ముస్లీం మైనార్టీ ఓటర్లు ఆలోచించాలి.. టీపీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

Prasanth Varma: ప్రశాంత్ వర్మపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసిన నిర్మాత.. ఎందుకంటే?

Telangana Land Scam: గత ప్రభుత్వంలో పట్టా భూమిగా మారిన సీలింగ్​.. ప్రభుత్వ అధీనంలోని భూములు అన్యాక్రంతం!