Hyderabad Drug Bust (IMAGE Credit: swetcha reporter)
హైదరాబాద్

Hyderabad Drug Bust: హైదరాబాద్‌లో డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు.. రూ. కోటి విలువైన డ్రగ్స్‌ స్వాధీనం!

Hyderabad Drug Bust: పక్కగా సేకరించిన సమాచారంతో మల్కాజిగిరి ఎస్వోటీ అధికారులు కీసర పోలీసులతో కలిసి డ్రగ్ పెడ్లర్‌ను (Hyderabad Drug Bust) అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి కోటి రూపాయల విలువ చేసే 7కిలోల ఓపీఎం, 2కిలోల పాపీస్ట్రాను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనర్​ సుధీర్ బాబు (Rachakonda Commissioner Sudheer Babu) మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్తాన్ రాష్ట్రం ఛిత్తోర్ ఘడ్​ చార్ భుజా మందిర్​ ప్రాంత నివాసి లోకేశ్ బరెత్ (26) 10వ తరగతి వరకు చదివాడు. ఆ తరువాత ఓ దుస్తుల దుకాణంలో సేల్స్ బాయ్ గా పని చేశాడు. అక్కడ ఉద్యోగం మానేసి డామినోస్​ పిజ్జాలో డెలివరీ బాయ్ గా పని చేస్తూ ఉదయ్ పూర్​ లో షార్ట్ టర్మ్ హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్​ చదివాడు. అనంతరం ఉదయ్ పూర్​ లోనే ఉన్న గోల్డెన్ పామ్ హోటల్ లో మేనేజర్ గా చేరాడు.

 Also Read: Drug Racket: మరో సక్సెస్ సాధించిన ఈగల్.. ఎన్ని కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారంటే?

మాదక ద్రవ్యాలను హైదరాబాద్, చెన్నైలకు తీసుకెళుతూ

ఆ తరువాత కొన్ని రోజులకే హోటల్ యాజమాన్యం మారటంతో ఉద్యోగం కోల్పోయాడు. పని కోసం వెతుక్కుంటున్న క్రమంలో అతనికి రాజస్తాన్​ కే చెందిన జగదీష్​ గుజ్జర్​ తో పరిచయం ఏర్పడింది. అప్పటికే డ్రగ్స్ దందా చేస్తున్న జగదీష్​ గుజ్జర్​ సలహాతో లోకేశ్ కూడా అదే పని మొదలు పెట్టాడు. రాజస్తాన్ నుంచి ఓపీఎం, పాపీస్ట్రా మాదక ద్రవ్యాలను హైదరాబాద్, చెన్నైలకు తీసుకెళుతూ అమ్ముతూ వస్తున్నాడు. ఆగస్టు నెలలో ఇలాగే హైదరాబాద్ వచ్చి 2 కిలోల ఓపీఎంను కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తికి విక్రయించి వెళ్లాడు. ఇక, జగదీష్​ గుజ్జర్ సూచనల మేరకు ఈనెల 8న 7కిలోల ఓపీఎం, 2 కిలోల పాపీస్ట్రాతో రాజస్తాన్ నుంచి రైల్లో బయల్దేరి  హైదరాబాద్ చేరుకున్నాడు.

ఈ కేసుల్లో 1‌‌0 సంవత్సరాల జైలు శిక్ష

వీటిని డెలివరీ ఇవ్వటానికి కీసర స్టేషన్​ పరిధిలోని కుందన్ పల్లి ఓఆర్​ఆర్​ రోటరీ వద్దకు వచ్చాడు. ఈ మేరకు సమాచారం సేకరించిన మల్కాజిగిరి ఎస్వోటీ సీఐ జానయ్య, ఎస్​ఐ సాయికుమార్​, కీసర సీఐ ఆంజనేయులుతోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి లోకేశ్​ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న జగదీష్​ గుజ్జర్ కోసం గాలింపు చేపట్టారు. కాగా, డ్రగ్స్ దందా చేసినా, రవాణా చేసినా, సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం సెక్షన్ 31ఏ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కేసుల్లో 1‌‌0 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందన్నారు. కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చని చెప్పారు. సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎస్వోటీ అదనపు డీసీపీ నర్సింహా రెడ్డి, ఏసీపీ అంజయ్య పాల్గొన్నారు.

 Also Read: Amazing Facts: ఒక నిముషం సమయంలో మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

ధూల్ పేటలో గంజాయి సీజ్

గంజాయి విక్రయాలు జరుగుతున్న ఇంటిపై ఎక్సయిజ్​ స్ టాస్క్ ఫోర్స్ ఏ టీం పోలీసులు దాడి చేశారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి 1.240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లోయర్ ధూల్ పేట ఇమ్లీబాగ్ లో వీరేందర్​ సింగ్ అనే వ్యక్తి ఇంట్లోనే గంజాయి నిల్వ చేసి అమ్ముతున్నట్టు సమాచారం అందటంతో సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి దాడి జరిపారు. వీరేందర్ సింగ్ ను అరెస్ట్ చేసి గంజాయి సీజ్​ చేశారు. ఇదే కేసులో కమలేశ్​ బాయి, నందిని బాయి, అనిత బాయి, రాధిక, రచన బాయిలపై కూడా కేసులు నమోదు చేశారు.

Also ReadDrug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?