SRH Image Source twitter
హైదరాబాద్

SRH: హెచ్​ సీఏ, ఎస్​ఆర్ హెచ్​ మధ్య కొనసాగుతున్న మెయిల్​ వార్

SRH:  హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​.. సన్​ రైజర్స్​ హైదరాబాద్​ మధ్య మెయిల్​ వార్​ కొనసాగుతోంది. ఫ్రీ పాస్​ ల కోసం హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ ఒత్తిడి తెస్తోందని.. ఇలా చేస్తే హైదరాబాద్​ విడిచి పెట్టి వెళ్ళిపోతామంటూ సన్​ రైజర్స్​ హైదరాబాద్ మేనేజ్​ మెంట్ చేసిన హెచ్చరికపై హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ అంతే ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ఓ మెయిల్​ ను సన్​ రైజర్స్​ హైదరాబాద్​ మేనేజ్​ మెంట్​ కు పంపించింది. దాంట్లో కోటాకు మించి అదనంగా పాస్​ లు ఇవ్వాలని ఎప్పడూ అడగలేదని స్పష్టం చేసింది.

హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించటం మంచి పద్దతి కాదని పేర్కొంది. కొన్ని సమస్యలు ఉన్నా ఐపీఎల్​ మ్యాచ్​ లను విజయవంతంగా నిర్వహించాలని మౌనంగా ఉంటున్నామని పేర్కొంది. తమ కార్యవర్గ సభ్యులపట్ల సన్​ రైజర్స్​ హైదరాబాద్​ ఉద్యోగ బృందంలోని కొందరు అనుచితంగా వ్యవహరిస్తున్న తీరు వల్లే సమస్యలు వస్తున్నాయంది. ఇప్పటికైనా ఈ మెయిళ్లకు స్వస్తి చెప్పి కూర్చని మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. దీనికి తాము సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది.

Also Read: BRS Silver jubilee: ఆ ఒక్క సభపైనే ఆశలు? పడరాని పాట్లు పడుతున్న బీఆర్ఎస్?

ఇప్పటివరకు ఉప్పల్​ లో జరిగిన రెండు మ్యాచ్​ లకు సన్​ రైజర్స్​ హైదరాబాద్​ యాజమాన్యం కేవలం 3,800 కాంప్లిమెంటరీ పాస్​ లే అని తెలిపింది. అవి కూడా కోశాధికారి శ్రీనివాస్​ కు ఇచ్చారుగానీ అధ్యక్షుడు జగన్మోహన్​ రావుకు కాదని పేర్కొంది. ఎఫ్​ 12ఏ బాక్సులో సామర్థ్యానికి మించి 50 టిక్కెట్లు ఇస్తామని సన్​ రైజర్స్​ యాజమాన్యం చెప్పిందని తెలిపింది. అయితే, కేవలం 30మంది కూర్చోవటానికి మాత్రమే వీలుండటంతో మిగిలిన 20 పాస్​ లను మరో బాక్స్​ లో సర్దుబాటు చేయాలని సూచించినట్టు తెలియచేసింది.

గతనెల 27న సన్​ రైజర్స్​ ప్రతినిధులు కిరణ్​, శరవణన్​, రోహిత్​ సురేశ్​ దీనికి అంగీకరించినట్టు పేర్కొంది. నిజానికి హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ కోశాధికారి శ్రీనివాస్​ తో జరిగిన సమావేశంలో శ్రీనాథ్​ పాల్గొనలేదని తెలిపింది. అలాంటపుడు ఆయన ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. తాము పంపిస్తున్న వాట్సాప్ మెసెజీలు, ఈ మెయిళ్లకు సన్ రైజర్స్​ ప్రతినిధులు స్పందించటం లేదని తెలిపింది.

ఇక, హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్​ అధ్యక్షుడు జగన్మోహన్​ రావు ప్రతీ మ్యాచ్​ కు 10శాతం టిక్కెట్లు బ్లాక్​ చేయమన్నారన్నది కూడా నిజం కాదని పేర్కొంది. ఆయన తన వ్యక్తిగత అవసరాల కోసం 10శాతం టిక్కెట్లు బ్లాక్​ చేయాలని అడగలేదని స్పష్టం చేసింది. తమ క్లబ్ సెక్రటరీలకు ఉచిత పాస్​ లు సరిపోక పోతుండటంతో డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనటానికి అవకాశమివ్వాలని అపెక్స్​ కౌన్సిల్​ గతనెల 19న కోరిన విషయాన్నిగుర్తు చేసింది. దీనికి సన్ రైజర్స్​ యాజమాన్యం అంగీకరించి హెచ్​సీఏ అకౌంట్​ నుంచి చెల్లింపులు జరపమని అడిగినట్టు తెలిపింది. దీనికి తాము అంగీకరించలేదని పేర్కొంది.

Also Read: Gorantla Madhav on TDP: పరిటాల ఫ్యామిలీపై గోరంట్ల ఫైర్.. హంతకులంటూ సంచలన ఆరోపణలు

టిక్కెట్లు కొన్నవారు వ్యక్తిగతంగా డబ్బు చెల్లిస్తారని స్పష్టంగా చెప్పినట్టు తెలిపింది. ఈ టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం పెండింగ్​ లో ఉండగానే జగన్మోహన్​ రావు తన వ్యక్తిగత అవసరాల కోసం 2,5‌‌‌‌00 టిక్కెట్లు బ్లాక్​ చేయాలని అడిగినట్టు దురుద్దేశాలు ఆపాదించటం సమంజసం కాదని పేర్కొంది. స్టేడియం ఆధునీకరణ విషయానికి వస్తే ఆరెంజ్​ కలర్​ సీట్లు వేయించాలని జస్టిస్​ నాగేశ్వరరావుని సన్​ రైజర్స్​ యాజమాన్యం కోరిందని పేర్కొంది. దీని కోసం అయ్యే 8 నుంచి 1‌0‌కోట్ల ఖర్చును సీఎస్​ఆర్​ నిధుల కింద చెల్లిస్తామని కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే, సన్​ రైజర్స్​ యాజమాన్యం ఈ మాటను నిలబెట్టుకోలేదని పేర్కొంది.

ఈ క్రమంలోనే స్టేడియంలో తాజా సీజన్​ ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించాలని సన్​ నెట్​ వర్క్​ ఎండీకి లేఖ కూడా రాశామని తెలియచేసింది. దీనిపై సానుకూలంగా స్పందించి స్టేడియానికి రంగులు వేయటం, కార్పోరేట్​ బాక్సుల ఆధునీకరణ పనులు మీరు చేపట్టగా కొత్త ఏసీల కొనుగోలు, వాటిని ఏర్పాటు చేయించటం తాము చేసినట్టుగా హెచ్​సీఏ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన రాద్ధాంతాన్ని పక్కనబెట్టి సమస్యల పరిష్కారానికి చర్చలు చేయటానికి ముందుకు రావాలని కోరింది.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..