హైదరాబాద్

Hyderabad Police: మద్యం త్రాగి, బండి నడిపి.. ఇంత మంది పట్టుబడ్డారేంటి?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Hyderabad Police: డ్రంకెన్​ డ్రైవ్​ పై సైబరాబాద్​ పోలీసులు స్పెషల్​ డ్రైవ్​ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి కమిషనరేట్​ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో పీకలదాకా మద్యం సేవించి వాహనాలు నడిపిన 389మంది పట్టుబడ్డారు. రోడ్డు ప్రమాదాలతోపాటు కొందరు ప్రాణాలు పోగొట్టుకోవటానికి కారణమవుతున్న డ్రంకెన్​ డ్రైవ్​ ను అరికట్టటానికి మూడు వారాలుగా సైబరాబాద్​ పోలీసులు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

Also read: Telangana Govt: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉగాది నుండి కొత్త పథకం ప్రారంభం..

ప్రతీ శనివారం రాత్రి కమిషనరేట్​ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి నడుపుతున్న వారిని పట్టుకుంటున్నారు. ఈ శనివారం రాత్రి కూడా మందు కొట్టి డ్రైవింగ్ చేసిన 315మంది ద్విచక్ర వాహనదారులు, 13 ఆటోవాలాలు, 59మంది కారు డ్రైవర్లు, ఇద్దరు భారీ వాహనాల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 26మందికి పరీక్షలు జరుపగా వారి రక్తంలో ఆల్కహాల్​ శాతం 10‌‌0 నుంచి 500 మిల్లీలీటర్లు ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది.

Also read: KTR Comments: కేసీఆర్ మంచివారే.. నేను కాదు.. కేటీఆర్

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిన అందరినీ ఆయా కోర్టుల్లో హాజరు పరచనున్నట్టు సైబరాబాద్​ కమిషనర్​ అవినాష్​ మహంతి తెలిపారు. తాగిన మత్తులో డ్రైవింగ్​ చేస్తూ ఎవరివైనా ప్రాణాలు పోవటానికి కారణమైతే నిందితులపై బీఎన్​ఎస్​ సెక్షన్​ 105 ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కేసుల్లో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు.

స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?