తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Hyderabad Cyber Crime: వర్క్ ఫ్రం హోం అంటూ ప్రైవేట్ ఉద్యోగిని ఉచ్ఛులోకి లాగిన సైబర్ క్రిమినల్స్ 2.50లక్షలు కొల్లగొట్టారు. మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి 6000862741 నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి వర్క్ ఫ్రం హోం ఇస్తామని చెప్పాడు.
Also read: Case Filed on KTR: మార్ఫింగ్ ఎఫెక్ట్.. నేరుగా కేటీఆర్ పై కేసు నమోదు
పెద్దగా చేయాల్సింది ఏమీ ఉండదు కొన్ని గూగుల్ రివ్యూలు, తాము చెప్పిన రెస్టారెంట్లపై ఫీడ్ బ్యాక్ లు పంపించాల్సి ఉంటుందని చెప్పాడు. దాంతో ఆ ప్రైవేట్ ఉద్యోగి పని చేయటానికి అంగీకరించాడు. ఈ క్రమంలో సైబర్ క్రిమినల్స్ అతనికి కొంత నగదును కూడా పంపించారు. ఇలా సదరు ప్రైవేట్ ఉద్యోగి నమ్మకాన్ని సంపాదించిన సైబర్ నేరస్తులు ఆ తరువాత తాము చెప్పినట్టుగా పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు సంపాదించవచ్చని ఆశ పెట్టారు.
Also read: HCA Fund Misuse: HCA లో ఘరానా మోసం.. ఈడీ విచారణలో సంచలన నిజాలు
తమ గ్యాంగులోని మరో సైబర్ క్రిమినల్ తో మాట్లాడించారు. అనంతరం ఓ ట్రేడింగ్ ప్లాట్ ఫాంకు పంబంధించిన వివరాలు ఇచ్చి దాంట్లో రిజిష్టర్ చేసుకొమ్మన్నారు. అదే సమయంలో వీక్స్ డేటా ఆస్క్ అన్న గ్రూపులో అతన్ని సభ్యునిగా కూడా చేర్చారు. పెట్టుబడులు పెట్టు..లాభాలు సంపాదించు అని చెప్పటంతో నిజంగానే డబ్బులు వస్తాయని ఆశ పడ్డ సదరు ప్రైవేట్ ఉద్యోగి 2.50 లక్షల రూపాయలను సైబర్ క్రిమినల్స్ చెప్పిన వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేశాడు. ఆ తరువాత మోసం జరిగిందని గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.