HCA Fund Misuse(Image credit: X)
స్పోర్ట్స్

HCA Fund Misuse: HCA లో ఘరానా మోసం.. ఈడీ విచారణలో సంచలన నిజాలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: HCA Fund Misuse- నిధుల గోల్​ మాల్​ వ్యవహారంలో హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ సభ్యులకు చెందిన 51.29 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్​ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. క్విడ్​ ప్రో కో పద్దతిలో లక్షల రూపాయలను స్వాహా చేసినందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది. గతంలో క్రికెట్​ బాల్స్​, బక్కెట్​ కుర్చీలు, జిమ్​ పరికరాల కోసం హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ సారా స్పోర్ట్స్​, ఎక్స్​ లెంట్​ ఎంటర్​ ప్రైజెస్​, బాడీ డ్రెంచ్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది.

Also read: Abhishek Sharma -Travis Head: అభిషేక్ తో హెడేక్..!

అయితే, మార్కెట్​ రేటుకన్నా ఎక్కువ ధరలు కోట్​ చేసినా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఈ సంస్థలకు కాంట్రాక్టర్లు ఇచ్చారు. ఈ విషయం వెలుగు చూడటంతో అప్పట్లో తీవ్ర కలకలం రేగింది. ఈ క్రమంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. దీంట్లో అప్పట్లో హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా, కోశాధికారిగా ఉన్న సురేందర్​ అగర్వాల్​ క్విడ్​ ప్రో కో పద్దతిన ఈ మూడు సంస్థల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు వెల్లడైంది.

క్రికెట్​ బాల్స్​ సప్లయ్​ చేసిన సారా స్పోర్ట్స్​ 17లక్షల రూపాయలను సురేందర్​ అగర్వాల్​ భార్య భాగస్వామిగా ఉన్న కేబీ జువెలర్స్​ సంస్థ ఖాతాతో పాటు ఆమె వ్యక్తిగత అకౌంట్​ లోకి కొంత నగదును ట్రాన్స్​ ఫర్​ చేసినట్టు వెల్లడైంది. దాంతోపాటు సురేందర్​ అగర్వాల్​ కుమారుడు అక్షిత్​ అగర్వాల్​ ఖాతాలోకి కూడా నగదును బదిలీ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. ఓ మ్యూజిక్​ షోను స్పాన్సర్ చేస్తున్నట్టుగా పేర్కొని నగదును ఆయా ఖాతాల్లోకి ట్రాన్స్​ ఫర్​ చేసినట్టు వెల్లడైంది.

Also read: Uppal Stadium: 23న ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. వాటికి నో పర్మిషన్.. సిపి సుధీర్ బాబు

అదే సమయంలో బకెట్​ కుర్చీలు సరఫరా చేసిన ఎక్స్​ లెంట్​ ఎంటర్​ ప్రైజెస్​ సంస్థ సురేందర్ అగర్వాల్​ , అతని కొడుకు అక్షిత్​ అగర్వాల్​ ఖాతాలతోపాటు వజ్రాలు కొన్నట్టుగా పేర్కొంటూ కేబీ జువెలర్స్​ అకౌంట్​ లోకి 21.86లక్షల రూపాయలను బదిలీ చేసింది. ఇక, జిమ్​ పరికరాలను సరఫరా చేసిన బాడీ డ్రెంచ్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ 52 లక్షల రూపాయలను సురేందర్​ అగర్వాల్​, ఆయన కూతురు ఖాతాల్లోకి బదిలీ చేసింది. విచారణలో వెల్లడైన ఈ వివరాల నేపథ్యంలో తాజాగా ఈడీ అధికారులు సురేందర్​ అగర్వాల్ ఆయన కుటుంబ సభ్యుల పేరున ఉన్న 51.29 లక్షల ఆస్తులను అటాచ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?