Sundar Raj Yadav: దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న యాదవ జాతికి క్యాబినెట్లో చోటు లేకపోవడం బాధాకరం అని అఖిల భారత యాదవ సంఘం సభ్యుడు, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. హన్మకొండ రాంనగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిల భారత యాదవ సంఘం సభ్యులు రాజారాం యాదవ్, గోవర్ధన్ యాదవ్, సుందర్ రాజ్ పాల్గొన్నారు. ఈనెల 30న హైదరాబాదులో జరిగే యాదవుల ఆత్మగౌరవ సభకు భారీ సంఖ్యలో రావాలని పిలుపు నిచ్చారు. అనంతరం సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు లేరు అనే సాకుతో యాదవ జాతిని వెనకబాటుకు గురిచేయవద్దని, వెంటనే మంత్రి పదవి కేటాయించాలని కోరారు. ప్రతీ జిల్లాలో, నియోజకవర్గంలో యాదవ కులస్తులు ఆవేదనతో ఉన్నారని చెప్పారు. నీతికి, నిజాయితీకి ప్రతీక యాదవ జాతి అని చెప్పే కాంగ్రెస్ పెద్దలు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యాదవ కులానికి పదవి కల్పించాలి
సీఎం రేవంత్ రెడ్డి మంచి మనస్సుతో అలోచించి యాదవ కులానికి పదవి కల్పించాలని విన్నవించారు. ఈనెల 30న యాదవుల ఆత్మగౌరవ సభ ఇందిరా పార్క్లో నిర్వహిస్తున్నామని, యాదవ బిడ్డలంతా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునించారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా రాజారాం యాదవ్ యాదవ జేఏసీ ఆధ్వర్యంలో జూన్ 30న ఇందిరా పార్క్లో యాదవ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని రాజారాం యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనివిప్పు కలిగేలా ఈ సభ ఉండబోతోందని పేర్కొన్నారు. సభను విజవంతం చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా యాదవులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు మంత్రి పదవి లేకపోవడం దుర్మార్గపు చర్య అని అభివర్ణించారు. హిందూ జాతికి భగవద్గీతను అందించిన జాతి యాదవ జాతి అని, తెలంగాణలో గోల్కొండను నిర్మించిన చరిత్ర యాదవ జాతిదని గుర్తు చేశారు.
Also Read: BRS Party: ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్!
ముస్లింలను కలుపుకొని 56% బీసీలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ నింపబోయే కేబినెట్ పదవుల్లో యాదవ జాతికి పెద్ద పీట వేయాలని కోరారు. అలాగే జనాభా ధమాషా పద్దతిలో యాదవులకు రావాల్సిన నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిపిన సమగ్ర కుటంబ సర్వేలో ముస్లింలు లేకుండా బీసీలు 52% ఉన్నారని, కానీ ఇప్పుడు ముస్లింలను కలుపుకొని 56% బీసీలు ఉన్నారు అని చెప్పడం సిగ్గుచేటన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. యాదవులు, మున్నూరుకాపులు లేని మంత్రి మండలి ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్కు మున్నూరుకాపులు కే కేశవరావు, డీఏస్ లాంటి వారు ఎన్నో సేవాలు చేశారని చెప్పారు. బీసీలకు మంత్రి మండలిలో సమూచిత స్థానం కల్పించాలని బీసీ కులాల లెక్కన 9 మందికి చోటు కల్పించాలని కోరారు.
యాదవులు లేకుండా మంత్రి మండలి లేదు.
యాదవులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రెండో విడత గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతూ చరిత్రలో యాదవులు లేకుండా మంత్రి మండలి లేదని, యాదవ మంత్రి లేకుండా పాలన చేస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. యాదవులను మరిచిపోతే కచ్చితంగా తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా చాటుతామని హెచ్చరించారు. మేకల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మొదటి అడుగు వేసి ఓట్లు వేసింది యాదవ జాతి బిడ్డలేనని గుర్తు చేశారు. యాదవులకు మంత్రి పదవి ఇవ్వకపోవడంలో కాంగ్రెస్ ఉద్దేశం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, రాజయ్య, మేకల కృష్ణ, మరియు వివిధ నాయకులు పాల్గోన్నారు.
Also Read: PM Modi – Trump: నీకు అంత సీన్ లేదు.. ట్రంప్ గాలి తీసేసిన ప్రధాని మోదీ!