TG Govt Bonus (imagecdit:swetcha)
నార్త్ తెలంగాణ

TG Govt Bonus: బోనస్ హామీతో యాసంగిలో పెరిగిన సన్నాల సాగు

TG Govt Bonus: వరి పంట సాగులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆరుగాలం కష్టపడి పంట పండించి అన్నం పెట్టే అన్నదాతకు ప్రోత్సాహం అందించే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న వరి ధాన్యంకు క్వింటాకు రూ.500 బోనస్ డబ్బులు ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. వర్షాకాలం పండించిన సన్న దాన్యంకు ప్రభుత్వం బోనస్ డబ్బులు రైతులకు చెల్లించి ప్రోత్సహించింది. రబీ సీజన్ లోను సన్నరకం వారిధాన్యంకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గతంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో యాంసంగిలో సన్నవడ్ల సాగు పెరిగింది. అయితే రబీ సీజన్(యాసంగి)కు సంబంధించిన సన్నవడ్లు రైతులు అమ్ముకుని రెండు నెలలు అయినా రాష్ట్రంలో ఒక్క రైతుకు కూడ బోనస్ డబ్బులు అందలేదు. దీంతో రాష్ట్రంలో రైతులు బోనస్ డబ్బులు వస్తాయా? రావా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించకపోవడం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో రైతుల్లో ఆందోళన మరింతగా పెరుగుతుంది. యాసంగిలో సన్నవడ్లు సాగు చేసి బోనస్ రాక ఇబ్బంది పడుతున్న తెలంగాణ రైతుల ఇబ్బందిపై స్వేచ్ఛ స్పెషల్ స్టోరీ.

యాసంగిలో పెరిగిన సన్నవడ్ల సాగు

సాధారణంగా వాతావరణ పరిస్థితులు దిగుబడికి దృష్టిలో ఉంచుకొని రైతులు వర్షాకాలమే సన్న వడ్లను సాగు చేస్తారు. యాసంగి పంట ఎక్కువగా దొడ్డు రకం సాగు చేస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలకు సన్న బియ్యం అందించేందుకు నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా సన్న వడ్లను దిగుబడిని పెంచే ఉద్దేశంతో సన్నబడ్డను సాగు చేసే రైతులకు ప్రోత్సాహం అందించేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడంతో ఈ యాసంగి సీజన్ లోనూ సన్న వడ్ల సాగు రికార్డుస్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో ఏప్రిల్ మాసంలో రెండో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలు, డీఆర్డీడీఏ-సెర్ప్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాలు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 74 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇది కొత్త రికార్డుగా అధికారులు చెబుతున్నారు.

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వరంగల్ జిల్లాలో 1,48,048 మెట్రిక్ టన్నులు, హనుమకొండ జిల్లాలో 1,80,819 మెట్రిక్ టన్నులు, జనగామ జిల్లాలో 23547 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాలో 1,13,677 మెట్రిక్ టన్నులు, ములుగు జిల్లాలో 39412 మెట్రిక్ టన్నులు, భూపాలపల్లి జిల్లాలోని 25942 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క రైతుకు కూడ బోనస్ డబ్బులు చెల్లించలేదు. మళ్ళీ వానాకాలం పంట సాగు ప్రారంభమైన సన్నవడ్లకు రావలసిన బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: Government Announces: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3.64 శాతం డీఏ పెంపు!

కష్టాల సాగు.. బోనస్ తో ఊరట

సన్నవడ్ల సాగు విస్తీర్ణం పెరిగిన ఆకాల వర్షాలు, వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి అనుకున్న స్థాయిలో దిగుబడి రాక ఒకవైపు రైతులు ఇబ్బంది పడి పంట సాగు చేసిన మరో వైపు మిల్లర్లు తేమ, తరుగు, తాలు పేరుతో ధాన్యం దిగుమతి చేసుకునేందుకు ఇబ్బందులకు గురి చేసి ఆనందంగా తూకంలో కోత విందించి ఇబ్బందులకు గురి చేసిన విధిలేని పరిస్థితుల్లో రైతులు ధాన్యం విక్రయించారు. అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలకు రూపాయల 500 బోనస్ ప్రకటించడంతో రైతులకు కొంత ఊరట కలిగించింది.

బోనస్ చెల్లించేందుకు ప్రైవేట్ కంపెనీల నిరాకరణ

తెలంగాణలోని అనేక జిల్లాలలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ప్రైవేట్ సీడ్ కంపెనీలు రైతులకు సన్నరకం అందించాయి. ప్రభుత్వం బోనస్ ఇస్తే తాము కూడా ఇస్తామని రైతులతో ప్రైవేట్ విత్తన సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం సన్నవటడ్లకు బోనస్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్ కంపెనీలు కూడా రైతులకు బోనస్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన సన్నవడ్లకు వెంటనే బోనస్ అందించాలని రైతుల కోరుతున్నారు. ప్రైవేట్ విత్తన సంస్థలు ఒప్పందాన్ని ధిక్కరించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

రెండు నెలలుగా ఎదురు చూస్తున్నాం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ప్రకటించడంతో యాసంగిలో సన్నవడ్ల సాగు ఇబ్బందికరమని తెలిసినా దాగు చేశాం. 66 క్వింటాళ్లు ఉన్నవాళ్లను కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. తూకం వేసి 2 నెలలు దాటిన ఇప్పటికీ బోనస్ ఇవ్వలేదు. బోనస్ డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరిగి విసుగు వచ్చిన ఎవ్వరు సరైనా సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లించాలని పాక కుమారస్వామి అనే రైతు తులిపారు.

Also Read: GHMC Engineers: బీనామీలతో పనులు దక్కించుకుంటున్న.. జీహెచ్ఎంసీ ఇంజినీర్లు!

ప్రభుత్వం వెంటనే డబ్బులు మా ఖాతాలో వెయ్యాలి

అనేక ఇబ్బందులు పడి సన్నవడ్లు సాగు చేశాం. వాతావరణం అనుకూలించకోవడం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంట పండించాం. వడ్లు అమ్మిన డబ్బులతోపాటు బోనస్ డబ్బులు కూడ పడతాయి అనుకున్నాం. కానీ రెండు నెలలు అయినా డబ్బులు రాలేదు. యాసంగి పంట అయిపోయి ఇప్పుడు వర్షాకాలం పంట సాగు చేసే సమయం వచ్చింది. బోనస్ డబ్బులు చెల్లిస్తే మా పెట్టుబడికి ఉపయోగ పడుతాయి. ప్రభుత్వం వెంటనే బోనస్ డబ్బులు విడుదల చేయాలని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు