Bhadradri Kothagudem ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Bhadradri Kothagudem: రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామాలు.. వర్షాకాలం వచ్చిందంటే నరకయాతనే!

Bhadradri Kothagudem: మండలంలోని మనుబోతుల గూడెం, వేములూరు మారుమూల గిరిజన గ్రామాలు. వారంతా నిరుపేద ఆదివాసీలు. ఎటువంటి అభివృద్ధికీ నోచుకోక అటవీ ప్రాంతాల్లో జీవనం గడుపుతున్నవారు. గ్రామాలకు కనీసం రహదారులు కూడా లేక అత్యవసర పరిస్థితుల్లో ఆపద పాలవుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బిక్కుబిక్కుమంటున్నారు. నిత్యావసరాలు కూడా అందని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎడ్లబండి వెళ్లేందుకు కూడా వీల్లేని పరిస్థితులు ఉండడంతో ఏవైనా ప్రమాదాలు జరిగినా, గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినా దేవుడిపైనే భారం వేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ ప్రాంతాలకు రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చే పాలకులు ఆ తరువాత తమ హామీలను విస్మరిస్తున్నారు. కొన్నిచోట్ల రోడ్లను మంజూరు చేసినా అటవీశాఖ అభ్యంతరాలు చెబుతోంది. దీంతో గిరిజనులు ప్రత్యక్ష నరకాన్ని ఎదుర్కొంటున్నారు.

Also Read: Bhadradri Kothagudem: నాణ్యతలేని సెంట్రల్ లైటింగ్ పనులు.. ప్రమాదాలకు మారుపేరుగా మారాయని స్థానికులు ఆగ్రహం!

అశ్వాపురం మండలంలోని సుమారు 15 ఆవాసాలకు లేని రోడ్డు

మండలంలోని ఏజెన్సీలో ఇప్పటికీ10 గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ముఖ్యం గా వేములూరు, మనుబోతులగూడెం, గ్రామాలకు రోడ్డు ఆనవాళ్లు కూడా లేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఎటువైపు రోడ్డు కనెక్టివిటీ లేక నాగరికతకు దూరంగా కొట్టుమిట్టాడుతున్నాయి. గొంది గూడెం కొత్తూరు వరకు రోడ్లు ఉన్నప్పటికీ ఏటా వర్షాకాలంలో మట్టి రోడ్లు బురదగుంటలుగా మారుతున్నాయి. పక్కా రోడ్లు నిర్మించాలన్న ప్రతిపాదనలున్నా అటవీశాఖ అనుమతుల రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మనుబోతుల గూడెం వేములూరు గ్రామాలకు ఎటువంటి రహదారి లేదు. వర్షాకాలంలో ఇసుక వాగు ప్రవహిస్తే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు ఈ గ్రామాలను సందర్శించి సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటివరకు నెరవేర్చలేదు. రహదారుల నిర్మాణం హామీలకే పరిమితమయింది.

Also Read: Bhadradri Kothagudem: గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు

Just In

01

Vishnu Priya: ఇప్పటికి మూడు సార్లు జరిగింది.. కిసిక్ టాక్స్‌లో ఆ నిజాలు బయట పెట్టిన విష్ణుప్రియ..

MLAs Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుని గడువు కోరిన స్పీకర్

Congress Politics: రాజగోపాల్ రెడ్డిని ఎలా కూల్ చేస్తారు?.. కాంగ్రెస్‌లో ఇంటర్నల్ పాలిటిక్స్ మళ్లీ మొదలు?

Kishan Reddy: సింగరేణికి సర్కార్ రూ.42 కోట్లు పెండింగ్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

JubileeHills Bypoll: బిల్లా రంగాలు ఇటొస్తే స్తంభానికి కట్టేయిర్రి.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ పంచ్‌ల మీద పంచులు