Land Scams ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ, రంగారెడ్డి

Land Scams: ఆగని భూముల రిజిస్ట్రేషన్లు.. మరిన్ని వివాదాలకు ఆజ్యం పోస్తున్న డిప్యూటీ తహశీల్ధార్లు!

Land Scams: రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం చర్చల్లో ఉండే ప్రాంతం ఫోర్త్​ సీటి. ఈఫోర్త్​ సీటిలోని మహేశ్వరం నియోజకవర్గం భూ వివాదాలకు (Land Scams) కేరాఫ్​ అడ్రస్ గా మారిపోయింది. ప్రభుత్వ అధీనంలో ఉండే భూములు రియల్​ వ్యాపారులకు కబ్జాలు, పట్టాలు చేసుకున్నారనే ప్రధానమైన ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలతో ప్రస్తుతం జిల్లాల్లో పనిచేసే రెవెన్యూ అధికారులు, సిబ్బంది జంకుతున్నారు. రెవెన్యూ నిబంధనలకు అనుగుణంగా , వివాదరహితమైన భూములను పరిశీలించి పట్టాదారులకు న్యాయం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంగా కొంత మంది వ్యక్తులు అధికార పార్టీ నేతల పేరుతో ఓ నాయకుడు, ప్రభుత్వంలోని ఓ చిరుద్యోగి కలిసి వివాదస్పదమైన భూములు క్రయవిక్రయాలు జరుపుతున్నారు. అంతేకాకుండా ఆ భూమి సమస్యను పరిష్కారించేందుకు ఆ చిరుద్యోగి ఆవ్యాపారితో కుమ్మక్కై రెవెన్యూలో పనిచేసే డిప్యూటీ తహశీల్ధార్​ మొదలు జేసీ చాంబర్​లోని ఓ జూనియర్​ అసిస్టెంట్​ ఉద్యోగులతో కలిసి ఫైరవీలకు పదును పెడుతున్నారు. వివాదస్పదమైన భూములను ఆ ఉద్యోగి తప్పుడు ఆలోచనలతో వారిని మ్యానేజ్​ చేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు.

Also ReadLand scam: హయత్​నగర్‌లో ఆగని అక్రమ భూదందాలు.. పట్టించుకోని అధికారులు

అధికారులను మభ్యపెట్టి రిజిస్ట్రేషన్లు

ఇప్పటికే మహేశ్వరం మండలం అంటే అధికారులు భయపడుతున్న పరిస్థితి కనిపించిన కొంత మంది ఉద్యోగులు తమకేమీ తెలియదనట్లు వ్యవహారిస్తున్నారు.మహేశ్వరం మండలం మన్​సన్​పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 189 సర్వే నెంబర్​ భూమిలో వివాదం నడుస్తుంది. అయినప్పటికి ఈ భూమిపై ఇప్పటికే పలు ఫిర్యాదులున్నా అధికారులు పట్టించుకోకుండా కాసులకు కక్కిర్తి పడి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే అక్టొంబర్​ 15వ తేదీన రిజిస్ట్రేషన్​ చేసేందుకు నిరాకరించిన అధికారిని బలవతంగా సాయంత్రం సమయంలో దగ్గరుండి డాక్యుమెంట్​ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ 189 సర్వే నెంబర్లో క్రయవిక్రయాలు సక్రమంగ ఉన్నప్పటికి బుకింగ్​ చేసుకున్న స్లాట్​ ప్రకారం రిజిస్ట్రేషన్​ చేయలేదు. ఎందుకు మధ్యాహ్నం వరకు మీనామేషాలు లెక్కిస్తూ లావాదేవీల ఓప్పందం తర్వాతే సంబంధిత అధికారి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రిజిస్ట్రేషన్​ చేయించేందుకు అధికారికి వ్యాపారికి మధ్యవర్తిగా ఉన్న చిరుద్యోగికి సుమారుగా రూ.15లక్షల డీల్ నడిపించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ సదరు ఉద్యోగి ఓప్పందంలో భాగంగా వచ్చిన నగదుతో క్రేట కారును తీసుకున్నారని స్థానికులు జోరుగా చర్చించుకుంటున్నారు.

నిషేధిత భూమికి క్లియరెన్స్​?

మహేశ్వరం మండలంలోని మన్సన్​పల్లి రెవెన్యూలోని 189 సర్వే నెంబర్​ భూమి డబూల్​ డాక్యుమెంట్​ రిజిస్ట్రేషన్​ కావడంతో వివాదంలో ఉంది. అయితే ఇదే సర్వే నెంబర్​లో ఓ సబ్​ డివిజన్​ నెంబర్​ పీవోబీలో ఉంటే ఆఫైల్​ క్లియర్​ చేయించే పనిలో ఆ చిరుద్యోగి జేసీ చాంబర్​లోని ఓ జూనియర్​ అసిస్టేంట్​తో సహాయంతో ఫైల్​ ముందుకు కదిలించినట్లు సమాచారం. అంతేకాకుండా జేసీ నుంచి కలెక్టర్​ వద్దకు ఫైల్​ వెళ్తే మరిన్ని వివరాలు కావాలని వెనక్కి పంపించారు. అయినప్పటికి క్షణాల్లో మరిన్ని వివరాలు జోడించి కలెక్టర్​కు ఫైల్​ పెట్టినట్లు సమాచారం. సామాన్య ప్రజలకు స్పందించన సిబ్బంది… వ్యాపారుల ఫైల్స్​కే ప్రాధాన్యతనిస్తూ దగ్గరుండి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ నిషేధిత భూమి క్లియరెన్స్​ పనిలో నిమగ్నమైతున్నారు.

క్షేత్రస్థాయి అధికారిపై నమ్మకంతోనే అడుగు

ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులు చేసే విధులపై నమ్మకంతోనే ఫైల్స్​ పై సంతకం చేస్తారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సులభంగా తప్పించుకునేందుకు క్షేత్రస్థాయిలోని అధికారులు ప్లానింగ్​ వెతుకుంటారు. భూ భాధితుడు ఇచ్చిన పత్రాలనే ఆసరాగా చేసుకోని ఫైల్స్​ ముందుకు పంపడంపై అనేక సమస్యలు వస్తున్నాయి. సమస్య పరిష్కారం దిశగా ఉన్నప్పుడు ఎలాంటి వాళ్లకు ఏవిధమైన అనుమానాలు అవసరం లేదు. కానీ పరిష్కారం కానీ సమస్యలతోనే అధికారులకు పరేషాన్ ఉంటుంది. 189 సర్వే నెంబర్​లో అదే తంతంగా నడుస్తుంది. ఎన్నో యేండ్లుగా డబూల్​ రిజిస్ట్రేషన్​ డాక్యుమెంట్ సమస్య కొనసాగుతుంది. ఈ సర్వే నెంబర్​లో ప్రభుత్వ భూమి లేకపోయినప్పటికి పట్టాదారుల మధ్యే పంచాయతీ ఉంది. పట్టాదారుడు ఏ అనే వ్యక్తి డాక్యుమెంట్​ చేశారు.

గిరిజనులను ఫీల్డ్​ నుంచి బయటికి వెళ్లగోట్టే కుట్ర

అదే పట్టాదారుడు మరో బి అనే వ్యక్తికి డాక్యుమెంట్​ చేశారు. దీంతో ఒకే పట్టాదారుడు ఇద్దరికి డాక్యుమెంట్​ చేశారు. ఇందులో ఏ డాక్యుమెంట్​ క్యాన్సల్ చేయలేదు. కానీ బీ అనే డాక్యుమెంట్​ వ్యక్తి మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్​ చేయడంపై అనుమానాలకు తావునిస్తుంది. ఎందుకంటే ఏ గానీ, బీగానీ భూమిపై కబ్జాలో లేకపోవడం విశేషం. కేవలం గిరిజనులు భూమిలో సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ రియల్​ వ్యాపారులంత కలిసి అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి రాజకీయ, అంగ బలంతో గిరిజనులను ఫీల్డ్​ నుంచి బయటికి వెళ్లగోట్టే కుట్ర చేస్తున్నారు. ఫైరవీకారులతో అధికారులు కుమ్మక్కై భూ వివాదాలను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈవిషయంపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గిరిజనలు వాపోతున్నారు.

Also Read: Bachupally Land Scam: బాచుపల్లిలో బడా భూస్కాం.. పైల్ డీ నోటిఫై చేసేందుకు అధికారుల తంటాలు

Just In

01

Gadwal District: అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచర్‌‌లు అరెస్ట్‌.. ఎక్కడంటే?

MLA Kadiyam Srihari: మొంథా ఎఫెక్ట్ పై జిల్లాస్ధాయి స‌మీక్ష‌.. కీలక అంశాలపై ఎమ్మల్యే కడియం చర్చ

KK survey: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేకే సర్వే వచ్చేసింది.. గెలుపు ఎవరిదంటే?

Yadadri Collector: జిల్లా కలెక్టర్‌ చిత్రపటానికి పాలాభిషేకం.. ఆయన చేసిన మంచిపని ఏంటో తెలుసా?

Biker First Lap: ‘గెలవడం గొప్ప కాదు.. చివరిదాకా పోరాడటం గొప్ప’.. ‘బైకర్’ గ్లింప్స్ ఎలా ఉందంటే?