Medchal District: మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు కట్ట నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా అక్రమంగా నీటిని వాణిజ్య అవసరాల కోసం తరలించడం వల్ల చెరువు కట్ట రోడ్డుకు తీవ్ర నష్టం జరుగుతోంది. నిరంతరంగా భారీ వాహనాల రాకపోకల కారణంగా ప్రజా రహదారి ధ్వంసమై, వాహనదారులు మరియు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువు కట్ట రోడ్డుపై గుంతలు ఏర్పడి, మట్టి మడుగులు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.
అక్రమ నీటి తరలింపును నిలిపివేయాలి
ఈ విషయంపై మేడ్చల్ అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సి. హనుమంత్ రెడ్డి స్పందిస్తూ, అక్రమంగా నీటిని వాణిజ్య ప్రయోజనాల కోసం తరలించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. GHMC అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నీటి తరలింపును నిలిపివేయాలని, దెబ్బతిన్న చెరువు కట్ట రోడ్డును వెంటనే మరమ్మతులు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: Medchal District: నవరాత్రి వేడుకలపై అప్రమత్తం.. పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్ మను చౌదరి

