Nizamabad: మానవత్వం చాటుకున్న ఇందూరు యువత
Nizamabad( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Nizamabad: మానవత్వం చాటుకున్న ఇందూరు యువత.. రెండు అనాథ శవాలకు అంత్యక్రియలు!

Nizamabad: మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ, గుర్తు తెలియని ఇద్దరు అనాథ మృతదేహాలకు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన రెండు మృతదేహాలు ఎవరూ గుర్తించకపోవడంతో ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. ఈ మృతులు రోడ్లపై నిస్సహాయ స్థితిలో ఉండగా, పోలీసులు వారిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ వారు తుదిశ్వాస విడిచారు. వారికి సంబంధించిన గుర్తింపు (ఐడెంటిటీ) గానీ, బంధువులు గానీ లేకపోవడంతో, అంత్యక్రియల బాధ్యతను ఎవరూ తీసుకోలేదు.

Also Read: Nizamabad MLA PA: ఆ జిల్లాలో నోటీసుల కలకలం. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఎమ్మెల్యే పీఏగా చేయడం ఏంటి?

సేవా సంస్థ చొరవ

ఈ పరిస్థితిని గమనించిన ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆ బాధ్యతను స్వీకరించింది. నిజామాబాద్ 1వ ఠాణా పోలీసు సిబ్బంది, కామారెడ్డి పోలీసు సిబ్బంది అనుమతితో, మంగళవారం ఆ రెండు అనాథ శవాలకు హిందూ సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ గొప్ప కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, నరేశ్ రెడ్డి, 1వ ఠాణా పోలీసు సిబ్బంది తరఫున రాజ్‌గోపాల్, కామారెడ్డి పోలీసు సిబ్బంది తరఫున విజయ్ తదితరులు పాల్గొన్నారు. వారి మానవతా దృక్పథాన్ని పలువురు ప్రశంసించారు.

Also ReadNizamabad Crime: తల్లి కోసమే హత్య? కారు డిక్కీ డెడ్ బాడీ కేసులో సంచలన నిజాలు..

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?