Huzurabad News: తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావు(PV Narasimha Rao) గౌరవార్థం హుజూరాబాద్ కేంద్రంగా ‘పీవీ జిల్లా’ను ఏర్పాటు చేయాలని కోరుతూ పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)లను కలిశారు. హైదరాబాద్(Hyderabada)లోని గాంధీ భవన్లో వారిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
పీవీ సేవా సమితి
ఈ సందర్భంగా పీవీ సేవా సమితి అధ్యక్షుడు తూము వెంకటరెడ్డి(Thumu Venkat Reddy), అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి. మనోజ్(B Manoj) మాట్లాడుతూ.. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి పీవీ నరసింహారావు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలనేది ఈ ప్రాంత ప్రజల ప్రబల ఆకాంక్ష అని వివరించారు. ఈ లక్ష్య సాధన కోసం ఇప్పటికే వివిధ సంస్థలు, ప్రజా సంఘాలు జేఏసీగా ఏర్పడి శాంతియుత మార్గంలో నిరసనలు తెలుపుతున్నట్లు పార్టీ అగ్రనేతలకు వివరించారు.
Also Read: Niharika Konidela: సంగీత్ శోభన్తో నిహారిక నిర్మిస్తున్న సినిమా టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదిరింది
హైకమాండ్ దృష్టికి..
జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని భౌగోళిక, పరిపాలనా సౌలభ్యాలు హుజూరాబాద్(Huzurabad)కు ఉన్నాయని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఇందుకు స్పందించిన మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లు.. ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. పీవీ జిల్లా సాధన కోసం గత ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు, పీవీ అభిమానులు మరింత ఉత్సాహంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా తూము వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
Also Read: Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో సంక్రాంతి శోభ.. డ్యాన్స్ చేసిన పవన్.. మూడ్రోజులు ధూమ్ ధామ్!

