Vinayaka Chavithi 2025 (Image Source: AI)
Viral

Vinayaka Chavithi 2025: గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలు.. చవితి రోజున ఈ నైవేద్యాలు ట్రై చేయండి!

Vinayaka Chavithi 2025: బొజ్జ గణపయ్య భోజన ప్రియుడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆయనకు ఎంతో ఇష్టమైన ఆహారాన్ని వినాయక చవితి రోజున భక్తులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. రకరకాల పిండివంటలతో వినాయకుడి మండపాన్ని నింపేస్తుంటారు. తద్వారా గణనాథుడి అనుగ్రహాన్ని పొందుతుంటారు. అయితే సౌత్ లో వినాయక చవితి సందర్భంగా ప్రధానంగా కనిపించే సంప్రదాయ వంటకాలు, దాని తయారీ విధానమేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

1. కుడుములు
కుడుములు లేదా మోదకం.. గణేశుడికి అత్యంత ఇష్టమైన నైవేద్యం. దీని బయట పొరను బియ్యంతో లోపల భాగాన్ని బెల్లం, కొబ్బరి పొడి మిశ్రమంతో నింపుతారు. ఇది ఒక రుచికరమైన తీపి వంటకం.

తయారీ: బియ్యం పిండిని ఆవిరిలో ఉడికించి బెల్లం, కొబ్బరి, యాలకులతో కలిపిన పూర్ణాన్ని అందులో నింపాలి. అనంతరం దాన్ని కుడుముల ఆకారంలోకి వచ్చేలా చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఆవిరిలో ఉడికించి లేదా కొన్నిసార్లు వేయించి సమర్పించవచ్చు.

ప్రాముఖ్యత: గణేశుడికి ఈ మోదకం అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యంగా పరిగణించబడుతుంది.

2. పులిహోర
చింతపండుతో తయారు చేసే ఈ రుచికరమైన అన్నం.. దక్షిణ భారతదేశంలో పండుగల సమయంలో సాధారణంగా కనిపిస్తుంటుంది.

తయారీ: చింతపండు రసంలో సుగంధ ద్రవ్యాలు, శనగపప్పు, వేరుశెనగ, కరివేపాకు ఆవాలను వేసి ఉడికించాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని అన్నంలో కలపాలి.

ప్రాముఖ్యత: ఈ వంటకం గణేశుడికి సమర్పించడానికి అనువైనది. పైగా ఎక్కువ మందికి ప్రసాదంగా పంచేందుకు వీలు ఏర్పడుతుంది.

3. పొంగలి
బియ్యం, పెసరపప్పుతో తయారు చేసిన ఈ రుచికరమైన వంటకం దక్షిణ భారతదేశంలో పవిత్రమైన నైవేద్యంగా పరిగణించబడుతుంది.

తయారీ: బియ్యం, పెసరపప్పును ఆవిరిలో ఉడికించి దానికి నెయ్యి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఇంగువ, జీడిపప్పును జోడించాలి.

ప్రాముఖ్యత: ఈ వంటకం గణేశ్ ఉత్సవంలో సరళమైన, రుచికరమైన నైవేద్యంగా సమర్పించబడుతుంది.

4. కొబ్బరి లడ్డూ
కొబ్బరి, బెల్లంతో తయారు చేసే తీపి వంటకం ఇది. దీనిని సులభంగా తయారు చేయవచ్చు. విఘ్నేశ్వరుడికి సమర్పించడానికి ఇది ఎంతో అనువైనది.

తయారీ: తురిమిన కొబ్బరిని బెల్లం, యాలకులతో కలిపి.. చిన్న గుండ్రని లడ్డూలుగా తయారు చేస్తారు.

ప్రాముఖ్యత: ఈ తీపి వంటకం గణేశ్ ఉత్సవంలో ప్రసాదంగా సమర్పించబడుతుంది. దీనిని అందరూ ఇష్టపడతారు.

5. పాయసం (కీర్)
బియ్యం, పెసరపప్పు లేదా వర్మిసెల్లితో తయారు చేసిన రుచికరమైన తీపి వంటకం ఇది. దీనిని దక్షిణ భారత పండుగలలో తప్పనిసరిగా తయారు చేస్తారు.

తయారీ: పాలలో బెల్లం లేదా చక్కెర, యాలకులు, కుంకుమ పువ్వు, జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసి ఉడికించి దీనిని తయారు చేస్తారు.

ప్రాముఖ్యత: పాయసం గణేశుడికి సమర్పించే ఒక పవిత్రమైన నైవేద్యం.

Also Read: PM CM Removal Bill: లోక్ సభలో గందరగోళం.. అమిత్ షా పైకి పేపర్లు విసిరిన విపక్ష సభ్యులు!

6. వడ
మినపప్పుతో తయారు చేసే ఈ క్రిస్పీ స్నాక్.. గణేశ్ ఉత్సవంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

తయారీ: మినపప్పును నానబెట్టి అనంతరం దానిని రుబ్బాలి. ఆ మిశ్రమానికి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చి మిర్చి కలిపి గుండ్రంగా చేయాలి. దానికి మంద్యలో రంద్రం చేసి నూనెలో వేయించాలి.

ప్రాముఖ్యత: సౌత్ లో ఒక రుచికరమైన నైవేద్యంగా వడను సమర్పిస్తుంటారు. ప్రసాదంగా దీన్ని పంచుతుంటారు.

Also Read: CM Revanth Reddy: హైదరాబాద్ పాతబస్తీ.. ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ.. సీఎం రేవంత్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!