High Security In Tirumala: జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) ఘటన యావత్ దేశాన్ని శోక సంద్రంలో ముంచెత్తింది. ఈ ఘటనపై ప్రతీ భారతీయుడు రగిలిపోతున్నాడు. పాక్ ఉగ్రమూకలపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. అటు ఈ దాడిలో ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడం.. రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇదిలా ఉంటే కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల అప్రమత్తమైంది. అక్కడి అధికారులు హైలెర్ట్ ప్రకటించారు.
Also Read: YCP Vidadala Rajini: విడదల రజనీకి బిగ్ షాక్.. మరిది అరెస్ట్.. నెక్ట్స్ ఇక ఆమెనా!
పహల్గాంలో ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో తిరుమలలో సెక్యూరిటీని అధికారులు కట్టుదిట్టం చేశారు. తిరుమల ఘాట్ రోడ్డు (Tirumala Ghat Road)లోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను ముమ్మరంగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొండపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీటీ (TTD) సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకుంటోంది. భద్రతా విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు.