India World Cup Squad: భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న మొదలుకానున్న టీ20 వరల్డ్ కప్ -2026కు భారత జట్టుని (India World Cup Squad) బీసీసీఐ (BCCI) శనివారం ప్రకటించింది. ఎవరూ ఊహించనన్ని మార్పులతో సెలక్షన్ కమిటీ టీమ్ని ప్రకటించింది.
సంచలన మార్పులు
బీసీసీఐ సెలక్టర్లు ఎవరూ ఊహించని రీతిలో జట్టుని ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్) లతో కూడిన 15 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా ముంబైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీమ్ను వెల్లడించారు. సేమ్ ఇదే టీమ్ వచ్చే నెలలో న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుందని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.
గిల్కు మొండిచెయ్యి.. ఇషాన్ కిషన్కు చోటు
సెలక్టర్ల అండదండలతో టీ20 జట్టులో చోటుదక్కించుకుంటున్నాడంటూ విమర్శలు ఎదుర్కొంటున్న వన్డే, టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు మొండిచెయ్యి ఎదురైంది. టీ20 వరల్డ్ కప్-2026 టీమ్లో సెలక్టర్లు చోటివ్వలేదు. గిల్ను ఎంచుకోకపోవడానికి కారణం ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, శుభ్మన్ గిల్ ప్రస్తుతం పరుగులు సాధించడంలో ఇబ్బందిపడుతున్నాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పారు. గత వరల్డ్ కప్లో కూడా గిల్ లేడని అన్నారు. మరోవైపు, ఎవరూ ఊహించని రీతిలో ఇషాన్ కిషన్ను సెలక్టర్లు టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేశారు. దేశవాళీ టీ20 ఫార్మాట్ టోర్మెంట్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించడంతో ఇషాన్ కిషన్ను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు. కిషన్ ఎంపికను ఎవరూ ఊహించలేదు. మరోవైపు, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో చోటుదక్కని రింకూ సింగ్ని కూడా సెలక్టర్లు టీమిండియాలోకి ఎంపిక చేశారు.
Read Also- Commissioner Sunil Dutt: జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి: సీపీ సునీల్ దత్
సంజూ శాంసన్ ఎంపికపై అగార్కర్ ఏమన్నారంటే
కొన్నిసార్లు ఆటగాళ్లను ఎంపిక చేయడం కష్టతరమవుతుందని, అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవని అజిత్ అగార్కర్ అన్నారు. సంజూ శాంసన్ క్లాలిటీ ప్లేయర్ అనే తామంతా భావిస్తున్నామని, ఫామ్ విషయంలో ఎవరికైనా ఎత్తుపల్లాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. అయితే, టీమ్లో కాంబినేషన్లు కూడా ముఖ్యమని, ఎవరో ఒకరు జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుందని పరిస్థితిని వివరించారు. పక్కనకూర్చోబెట్టినంత మాత్రాన వాళ్లు మంచి ఆటగాళ్లు కాదని భావించకూడదని అన్నారు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో చాలా ఆప్షన్లుఉన్నాయని వివరించారు.
ఒక క్రికెటర్ టెస్టులు, టీ20లు ఆడుతున్నాడంటే, అది కేవలం కాంబినేషన్ల కోసమేనని చెప్పలేమని అన్నారు. గతేడాది దక్షిణాఫ్రికాలో సంజూ శాంసన్, తిలక్ వర్మ సెంచరీలు సాధించినప్పుడు, టెస్ట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉందని గుర్తుచేశారు. నిన్న రాత్రి (దక్షిణాఫ్రికాతో మ్యాచ్) సంజూ ఓపెనర్గా బ్యాటింగ్ చేయడం అంతా చూశారని, తమ ఆలోచనలు ఏవిధంగా ఉంటాయో దీనినిబట్టి స్పష్టమవుతోందని అగార్కర్ అన్నారు. రెండవ వికెట్ కీపర్ను కూడా ఎంపిక చేసుకున్నామని చెప్పారు.
లెఫ్ట్-రైట్ కాంబినేషన్ చూడడం లేదు: సూర్య
మ్యాచ్లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం అంతగా చూడడం లేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. లెఫ్ట్ హ్యాండ్- రైట్ హ్యాండ్ కాంబినేషన్కు అక్కర్లేని ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోందని సూర్య అన్నాడు. తుది జట్టు కూర్పు విషయానికి వస్తే, తిలక్ శర్మ 3వ స్థానంలో, తాను 4వ స్థానంలో ఖరారైనట్టేనని తెలిపాడు. తిలక్ తన రోల్ ఏంటో తెలుసుకుని, ఆడేలా మూడవ నంబర్ బ్యాటింగ్ పొజిషన్ను అతడికి ఫిక్స్ చేయాలనుకుంటున్నామని సూర్య వివరించాడు.
మరోవైపు, టీ20 ప్రపంచకప్-2026కు, అలాగే న్యూజిలాండ్ సిరీస్కు జట్టులో స్టాండ్బై ప్లేయర్లు ఉండరని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధృవీకరించారు. ఈ రెండు టోర్నీలు భారత్ వేదికగానే జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2026 announced 🚨
Let's cheer for the defending champions 💪#TeamIndia | #MenInBlue | #T20WorldCup pic.twitter.com/7CpjGh60vk
— BCCI (@BCCI) December 20, 2025

