Sabarimala Special Trains: శబరిమల యాత్ర సీజన్ సందర్భంగా భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కేరళలోని కొల్లం వరకు 60 ప్రీ-శబరిమల ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ రైళ్లు ఎప్పటి నుంచి నడుస్తాయంటే?
ఈ ప్రత్యేక రైళ్లు 2025 నవంబర్ నుండి 2026 జనవరి వరకు నడుస్తాయి. ప్రతి ఏడాది శబరిమల యాత్ర సమయంలో భారీగా భక్తులు ప్రయాణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
రైళ్ల మార్గాలు & ముఖ్య వివరాలు
మచిలీపట్నం – కొల్లం (10 ట్రిప్స్)
ట్రైన్ నంబర్: 07101 / 07102
మార్గం: గూడూరు, రేణిగుంట మార్గం
ముఖ్య స్టేషన్లు: విజయవాడ, సేలం, ఎరోడ్, పాలక్కాడ్, ఎర్నాకుళం టౌన్, కోట్టాయం, చెంగన్నూర్ వంటి ముఖ్య రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
Also Read: Nizamabad Crime: రియల్ ఎస్టేట్లో మాఫియా లేడి.. నమ్మించి రూ.లక్షల్లో వసూలు.. అరెస్ట్ చేసిన పోలీసులు
1. మచిలీపట్నం – కొల్లం (10 ట్రిప్స్)
ట్రైన్ నంబర్: 07103 / 07104
రూటు : గుంటూరు, నంద్యాల, కడప, రేణిగుంట
స్టాపేజీలు: మార్కాపుర్ రోడ్, ఎరోడ్, అలువా
వెనుతిరుగు ప్రయాణంలో: డిగువమేట్టా వద్ద అదనపు హాల్ట్
2. నరసాపురం – కొల్లం (20 ట్రిప్స్)
ట్రైన్ నంబర్: 07105 / 07106
రూటు : విజయవాడ, గూడూరు, రెనిగుంట
హాల్ట్లు: భీమవరం, పాలకొల్లు, తిరుప్పూర్, కోట్టాయం
3. చర్లపల్లి – కొల్లం (20 ట్రిప్స్)
ట్రైన్ నంబర్: 07107 / 07108
రూటు : గుంటూరు, గూడూరు, రెనిగుంట
ముఖ్య స్టేషన్లు: నల్గొండ, మిర్యాలగూడ, సేలం, ఎరోడ్, ఎర్నాకుళం టౌన్
భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు
ఈ ప్రత్యేక రైళ్లు శబరిమల యాత్రికుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా నడపబడుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందుగానే బుకింగ్లు చేసుకోవాలని, పూర్తి టైమ్టేబుల్ వివరాలు అధికారిక వెబ్సైట్లో పరిశీలించాలని సూచించారు.
