Uttar Pradesh: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పులు
Uttar Pradesh ( Image Source:Twitter)
జాతీయం

Uttar Pradesh: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పులు.. టీచర్ మృతి

Uttar Pradesh: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU) క్యాంపస్‌లో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక అధ్యాపకుడు మృతి చెందగా, ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రకారం, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అధ్యాపకుడిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయాన్ని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) నీరజ్ జడాన్ ధృవీకరించారు. ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారని, నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Also Read: AV Ranganath: పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి.. అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌!

ఈ కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని రావు దానిష్ అలీగా గుర్తించారు. ఆయన యూనివర్సిటీకి చెందిన ABK స్కూల్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. కాల్పుల అనంతరం తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్కు తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Also Read: Thummala Nageswara Rao: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఈ ఘటనపై స్పందించిన AMU ప్రాక్టర్ ప్రొఫెసర్ మొహమ్మద్ వసీం అలీ, క్యాంపస్ లైబ్రరీ సమీపంలో రాత్రి సుమారు 9 గంటల సమయంలో కాల్పులు జరిగాయని తెలిపారు. లైబ్రరీ వద్ద కాల్పుల ఘటన జరిగిందని సమాచారం అందిన వెంటనే గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారని, అనంతరం అతను ABK స్కూల్‌కు చెందిన అధ్యాపకుడు రావు దానిష్ అలీగా గుర్తించబడినట్టు చెప్పారు. ఆయన తలకు తూటా తగలడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వెల్లడించారు.

అయితే, ఘటన సమయంలో ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారనే విషయంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. కొన్ని వర్గాలు మూడు కాల్పులు జరగగా, మరికొన్ని వర్గాలు ఐదు రౌండ్లు కాల్చినట్లు చెబుతున్నాయని సమాచారం. ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై మాట్లాడిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు లేవని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని వ్యాఖ్యానించారు. “ఇది కొత్త ఉత్తరప్రదేశ్. ఇక్కడ శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి” అని ఆయన పేర్కొన్నారు.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పెన్ డ్రైవ్.. ఆధారాలతో ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం!

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. క్యాంపస్‌లో భద్రతపై ఈ ఘటనతో మరోసారి చర్చ మొదలైంది.

Just In

01

Wife Extramarital affair: పెళ్లైన 4 నెలలకే బయటపడ్డ భార్య ఎఫైర్.. ఫ్లెక్సీ వేయించి భర్త న్యాయపోరాటం!

Galaxy Watch: గెలాక్సీ వాచ్ వినియోగదారులకు శుభవార్త..

Pawan Kalyan: పవన్ ఖాతాలో మరో ఘనత.. ఏపీకి జాతీయ స్థాయిలో నెంబర్ 1 ర్యాంక్

Tollywood Flops: 2025లో నిర్మాతలను నిండా ముంచేసిన టాలీవుడ్ టాప్ టెన్ సినిమాలు ఇవే?..

Maoist Encounter: భారీ ఎన్ కౌంటర్.. టాప్ తెలుగు మావోయిస్టు నేత హతం