Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి ఎక్సయిజ్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి లక్షా 50వేల రూపాయల విలువ చేసే 50 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్ సూపరిండింటెంట్ నవీన్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కుషాయిగూడ నివాసి వీరస్వామి (47) రక్షణ సంస్థల్లో పని చేస్తున్న కొందరు ఉద్యోగులతో పరిచయాలు ఏర్పరుచుకున్నాడు.
Also Read: GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాలు చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం
డిఫెన్స్ క్యాంటీన్ల నుంచి వారితో మద్యం కొనిపించేవాడు. రెండు మూడు వందలు కమీషన్ గా వారికి ముట్టజెప్పేవాడు. ఆ తరువాత తన లాభం కలుపుకొని వాటిని ఇతరులకు అమ్ముతూ వస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందటంతో అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరిండింటెంట్ ముకుంద రెడ్డి, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు కుమారస్వామి, సంధ్యారాణితోపాటు సిబ్బందితో కలిసి వీరస్వామి ఇంటిపై దాడి జరిపారు. మద్యం బాటిళ్లతోపాటు మొబైల్ ఫోన్, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
నాంపల్లిలో గంజాయి సీజ్…
విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సీ టీం అధికారులు గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 5వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి అఫ్జల్ సాగర్ ప్రాంతంలో నివాసముంటున్న సచిన్ ఉపాధ్యాయ తన ఇంట్లోనే గంజాయి స్టాక్ చేస్తూ అమ్ముతున్నట్టుగా అధికారులకు తెలిసింది. ఈ క్రమంలో సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు.
Also Read:Nagarkurnool Politics: నాగర్ కర్నూల్ జిల్లాలో రాజకీయ వేడి… మర్రి మాటలకు కూచుకుళ్ల కౌంటర్