RV Karnan: జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేశామని కమషనర్ కర్నన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో దాదాపుగా 3,000 మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. డబుల్ ఓటర్స్ ఉన్న వారిపై డబల్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఓటు వేయడానికి అనుమతి ఇస్తామని అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(Model Code of Conduct) ఉల్లంగించిన వారిపై ఇప్పటికే 27 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎన్నికకు సరిపడా EVM లు అందుబాటులో ఉన్నాయని, అలాగే పోలింగ్లో 4 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంచాంమని తెలిపారు.
Also Read: CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి వెనుక కాంగ్రెస్ కృషి ఉంది: రేవంత్ రెడ్డి
ఉదయం పోలింగ్ స్టార్ట్..
ఈ సారి జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం 139 డ్రోన్ల తో నిఘా పెడుతున్నాంమని తెలిపారు. మాక్ పోలింగ్ ఉదయం జరుగుతుందని, ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. ఈ ఎలక్షన్లో పాల్గొనే సిబ్బందికి రెండు విడతల ట్రైనింగ్ ఇచ్చాంమని తెలిపారు. సోషల్ మీడియా(Social media)తో పాటు గూగుల్ పే(Google Pay), ఫోన్ పే(Phone Pay) పై స్పెషల్ ఫోకస్ పెట్టామి తెలిపారు. రేపు నియోజకవర్గంలో EVM పంపిణీ చేస్తాంమని తెలిపారు.ఉప ఎన్నికల కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు.
Also Read: Bigg Boss Telugu 9: ట్రోఫీకి, ఎగ్జిట్కి దగ్గరగా ఉందెవరంటే? మళ్లీ తనూజ చేతుల్లోనే ఎలిమినేషన్!
