Student Suicide(image credit:X)
హైదరాబాద్

Student Suicide: ఫిర్యాదు చేస్తే బెదిరిస్తున్న పోలీసులు .. మహిళా కమిషన్​ ను ఆశ్రయించిన బాధితులు!

Student Suicide: పోలీస్​ స్టేషన్లను ప్రథమ న్యాయ స్థానాలని చెబుతారు. బాధితులకు న్యాయం దొరుకుతుందని భావిస్తారు. అయితే, చైతన్యపురి పోలీస్​ స్టేషన్​ లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని దంపతులు ఫిర్యాదు చేస్తే విచారణ జరపాల్సింది పోయి కేసు వాపసు తీసుకొమ్మని సీఐ, ఎస్సైలు బెదిరిస్తున్నారు. దాంతో బాధితులు బుధవారం మహిళా కమిషన్​ లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా పాతర్లపాడు మండలానికి చెందిన బీమగాని మణెమ్మ, కృష్ణయ్యలు భార్యాభర్తలు. వీరి కూతురు గంగోత్రి. ఉన్నత విద్య అభ్యసించటానికి హైదరాబాద్​ వచ్చిన గంగోత్రి చైతన్యపురి బాబు కాంప్లెక్స్​ ప్రాంతంలో నివాసముంటున్న అక్క ఇంట్లో ఉంటోంది. కాగా, మార్చి 8న గంగోత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు చేసి వేధించటం వల్లనే గంగోత్రి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులకు తెలిసినా ఆ కాల్స్ చేసింది ఎవరన్నది తెలియరాలేదు.

కాగా, ఇటీవల ఈ వేధింపులకు పాల్పడిన వారి గురించి సమాచారం వచ్చినట్టు మణెమ్మ, కృష్ణయ్యలు చెప్పారు. ఆరునెలల క్రితం గంగోత్రి స్వస్థలానికి రాగా అదే ప్రాంతానికి చెందిన కేశబోయిన మహేశ్​, జటంగి మహేశ్​ లు తమ కూతురికి ఓ ఫోన్ ఇచ్చి ప్రతీరోజూ మాట్లాడాలని చెప్పినట్టుగా తెలియవచ్చిందన్నారు. అలా చేయకపోతే నీ తమ్మున్ని చంపేస్తామని బెదిరించినట్టుగా తెలిసిందన్నారు.

Also read: Crime News: వృద్ధ దంపతుల హత్యలో నిందితుడి అరెస్ట్.. భలే పట్టేశారే!

ఈ కారణంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందన్నారు. ఇదే విషయమై చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే, తమ ఫిర్యాదుపై కేసులు నమోదు చేయకుండా సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై భద్రయ్యలు తమనే దుర్భాషలాడారని చెప్పారు. కేసులు వాపసు తీసుకోవాలని బెదిరించినట్టు తెలిపారు. ఏప్రిల్​ 28న ఎస్సై భద్రయ్య తమ స్వగ్రామానికి రాత్రి 2గంటల సమయంలో వచ్చి తనను దౌర్జన్యంగా జీపులోకి ఎక్కించుకుని పోలీస్​ స్టేషన్​ కు తీసుకెళ్లినట్టు కృష్ణయ్య తెలిపాడు.

అక్కడ తనను నిర్భంధించి కేసును వాపసు తీసుకోవాలని వేధించినట్టు చెప్పాడు. తమ కూతురి మొబైల్​ కాల్​ లిస్టును కూడా ఇప్పటికీ తెప్పించలేదన్నాడు. జటంగా మహేశ్​ కు అండగా మాట్లాడుతూ రెండు నెలలుగా పోలీస్​ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే న్యాయం చేయాలంటూ మహిళా కమిషన్​ లో ఫిర్యాదు చేసినట్టు చెప్పాడు.

తమ బిడ్డ చావుకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపాడు. కేసును వాపసు తీసుకోవాలంటూ బెదిరించిన సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై భద్రయ్యలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

 

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?