Drugs Case: హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాపై ఎక్సైజ్ టాస్క్
Drugs Case ( image credit: swetcha reporter)
హైదరాబాద్

Drugs Case: హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాపై.. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు!

Drugs Case: పక్కగా అందిన సమాచారంతో ఎక్సయిజ్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు దాడులు జరిపి 42గ్రాముల ఓజీ కుష్​ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిని విక్రయిస్తున్ని ఇద్దరిని అరెస్ట్​ చేసి కారు, టూ వీలర్, రెండు మొబైల్​ ఫోన్లను సీజ్​ చేశారు. బేగంపేటలోని సింధి కాలనీలో గంజాయి దందా జరుగుతున్నట్టు తెలిసి ఎస్టీఎఫ్ ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. విచారణలో మరో పదిమందికి కూడా ఈ దందాతో సంబంధం ఉన్నట్టుగా తేలటంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ నిందితులను జరిపిన విచారణలో వెల్లడైన వివరాల మేరకు మరో ఇద్దరిని ధూల్ పేట ప్రాంతంలో అరెస్ట్ చేసి 29.8గ్రాముల ఓజీ కుష్​ గంజాయిని సీజ్​ చేశారు. ఈ కేసులో బెహ్రా అనే వ్యక్తితోపాటు మరొకరిని అరెస్ట్ చేశారు.

Also Read: Drugs Case: షాకింగ్.. డ్రగ్స్‌కు బానిసైన నమ్రత.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

ఎండీఎంఏ డ్రగ్​ తో మహిళ అరెస్ట్

డ్రగ్స్​ కు అలవాటు పడ్డ మహిళతోపాటు ఆమెకు మాదక ద్రవ్యాలను సప్లయ్ చేస్తున్న వ్యక్తిని ఎక్సయిజ్​ స్టేట్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖైరతాబాద్ ఆనంద్​ నగర్ వాస్తవ్యురాలు శ్రీయ కొన్ని రోజులుగా డ్రగ్స్​ కు అలవాటు పడింది. ఈ క్రమంలో ప్రణీత్ అనే వ్యక్తి ద్వారా ఎండీఎంఏ డ్రగ్​ తెప్పించుకుంటోంది. ఈ మేరకు సమాచారాన్నిసేకరించిన ఎస్టీఎఫ్​ బీ టీం సీఐ భిక్షారెడ్డి, ఎస్​ఐ బాలరాజుతోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ‌‌0.40గ్రాముల ఎండీఎంఏ డ్రగ్​ ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే టీం సిబ్బంది హస్తినాపురంలో గంజాయి అమ్ముతున్న నితీష్​ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 252 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు.

Also Read: Fake Drugs: దొంగ మందులపై డీసీఏ తనిఖీల కొరడా

Just In

01

Bigg Boss9 Telugu: రీతూ వెళ్లిపోయాకా డీమాన్ పవన్ పరిస్థితి ఎలా ఉందంటే?.. భరణికి నచ్చనిదెవరంటే?

Pakistan Spy: ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ అరెస్ట్.. పాకిస్థాన్‌కు సమాచారం చేరవేస్తున్నట్టు గుర్తింపు!

CPI Narayana: ఐబొమ్మ రవి జైల్లో ఉంటే.. అఖండ-2 పైరసీ ఎలా వచ్చింది.. సీపీఐ నారాయణ సూటి ప్రశ్న

Lancet Study: ఏజెన్సీ ఏరియా సర్వేలో వెలుగులోకి సంచలనాలు.. ఆశాలు, అంగన్వాడీల పాత్ర కీలకం!

IndiGo: ప్రయాణికులకు ఇండిగో భారీ ఊరట.. విమానాల అంతరాయాలతో తీవ్రంగా నష్టపోయిన వారికి రూ.500 కోట్లకు పైగా పరిహారం