Bike Theft: బైక్స్ దొంగిలించి ఆటోమొబైల్ షాప్ పెట్టాలని పథకం..!
Bike Theft (imagecredit:swetcha)
క్రైమ్, హైదరాబాద్

Bike Theft: హై రిచ్ బైక్‌ల దొంగల టార్గెట్.. వాటిని దొంగిలించి ఆటోమొబైల్ షాప్ పెట్టాలని పథకం..!

Bike Theft:: హై ఎండ్ బైక్ లే ఆ గ్యాంగ్​ టార్గెట్. ఎక్కడ పార్క్​ చేసి కనిపించినా రెప్పపాటులో కొట్టేసి ఉడాయించటం ముఠా సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య. డబ్బు కోసం ఈ చోరీలు చేశారనుకుంటే పొరపాటే. తస్కరించిన బైక్ లను ఏ పార్ట్ కా పార్ట్ ఊడదీసి స్వస్థలంలో స్పేర్​ పార్ట్స్(Spare parts)​ షాపు పెట్టాలన్నది వారి పథకం. కాగా, ఓ బైక్ చోరీ కేసులో చాకచక్యంగా దర్యాప్తు జరిపిన మియాపూర్​ పోలీసులు(Miyapur Police) గ్యాంగ్ సభ్యులను అరెస్ట్​ చేశారు. వారి నుంచి 21 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్​ డీసీపీ రితిరాజ్(DCP Rithiraj) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రికి చెందిన దుర్గా శ్రీనివాస్​ సాయికిరణ్​ (23), గొట్టపు లీలాసాయి (21), తూర్పోగోదావరికి చెందిన పురంశెట్టి విజయ్​ శివసాయి ప్రసాద్ (25), గెడ్డం ప్రవీణ్​ (25) స్నేహితులు. అందరికీ కలిసి వ్యాపారం చేయాలన్నది లక్ష్యం. పెట్టుబడి లేకపోవటంతో చిన్నాచితక నేరాలకు పాల్పడటం మొదలు పెట్టారు. వీటి ద్వారా ఆశించిన డబ్బు చేతికి అందక పోవటంతో హై ఎండ్​ బైకులను చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు.

కేటీఎం డ్యూక్​ బైక్..

తస్కరించిన వాహనాలను ఏ భాగానాకి ఆ భాగం విడదీసి సొంతూళ్లో ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్(Automobile spare parts)​ దుకాణం పెట్టుకోవాలని పథకం వేసుకున్నారు. దాని ప్రకారం హైదరాబాద్(Hyderbada) వచ్చారు. సైబరాబాద్​, సంగారెడ్డి(Sangareddy) కమిషనరేట్లలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో నుంచి రాత్రుళ్లు ఇండ్లు, అపార్ట్ మెంట్ల వద్ద పార్క్ చేసి ఉన్న బైక్ లను అపహరించటం మొదలు పెట్టారు. ఇలాగే మియాపూర్​ లోని ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కేటీఎం డ్యూక్​ బైక్ ను ఇటీవల అపహరించారు. ఈ మేరకు ఫిర్యాదు అందగా మియాపూర్​ ఏసీపీ శ్రీనివాస రావు(ACP Srinivasa Rao) పర్యవేక్షణలో మియాపూర్​ సీఐ శివప్రసాద్, డీఐ రమేశ్​ నాయుడు, డీఎస్​ఐ నర్సింహారెడ్డి సిబ్బందితో నిందితుల కోసం వేట మొదలు పెట్టారు.

Also Read: Harish Rao: పొమ్మనలేక పొగ పెట్టే ప్రయత్నం? పార్టీలో కీలక నేతగా ఎదిగితే గెంటేయడమేనా?

వరుసగా నేరాలు చేస్తూ..

సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి వాటిని విశ్లేషించటం ద్వారా నిందితులను గుర్తించారు. సోమవారం ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేశారు. విచారణలో ఈ గ్యాంగ్ కేపీహెచ్​బీ స్టేషన్(KPHP Police Station)​ పరిధి నుంచి 11, అమీన్​ పూర్ స్టేషన్​ పరిధి నుంచి 3, చందానగర్ స్టేషన్​ పరిధి నుంచి 3, గచ్చిబౌలి స్టేషన్​ పరిధి నుంచి 2, మియాపూర్, ఆర్సీపురం స్టేషన్ల పరిధుల్లో నుంచి ఒక్కో బైక్​ ను అపహరించినట్టుగా వెల్లడైంది. ఆ తరువాత ఆయా బైక్​ ల ఇంజన్, ఛేసిస్​ నెంబర్లను మార్చేసినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో ముఠా సభ్యుల నుంచి 21 బైక్​ లు, టూల్ కిట్ ను స్వాధీనం చేసుకున్నారు. వరుసగా నేరాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులను మాదాపూర్ అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి(DCP Udhay Reddy) అభినందించారు.

Also Read: BJP Telangana: మున్సిపల్ ఎన్నికలపై కమలం కన్ను.. ఈ ఎలక్షన్లు ముగిసాకా జీహెచ్ఎంసీపై ఫోకస్!

Just In

01

Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..

Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు

Ravi Teja: జర్నలిస్ట్‌ని ఆ ప్రశ్న అడిగేసిన రవితేజ.. మాస్ రాజా మామూలోడు కాదండోయ్!

Chiru – Venky: పాటతోనే కాదు.. ఎంట్రీతోనూ అదరగొట్టారు. మెగా విక్టరీ మాస్ ఎంట్రీ!

Sathupalli News: సత్తుపల్లి మెడికల్ సిండికేట్ దందా తనిఖీల్లో అనుమానాలు..?