Medchal News: స్వేచ్ఛ కథనానికి స్పందన.. ఆ నిర్మాణాల తొలగింపు
Medchal News [ image credit: swetcha reporter]
హైదరాబాద్

Medchal News: స్వేచ్ఛ కథనానికి స్పందన.. ఆ నిర్మాణాల తొలగింపు

మేడ్చల్ స్వేచ్ఛ: Medchal News: శిఖంచెరువు భూమి కబ్జాలను రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు బుధవారం తొలగించారు. స్వేచ్ఛ పత్రికలో గత నెల 30న ‘చిన్నదవుతున్న పెద్ద చెరువు’ శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గౌడవెల్లి గ్రామ రెవెన్యూ కి సంబంధించిన కొన్ని సర్వే నంబర్లలలోని భూమిలోకి వర్షాకాలంలో మేడ్చల్ పెద్ద చెరువు నిండినప్పుడు చెరువు నీళ్లు వచ్చి నిలుస్తున్నాయి.

అలా నిలిచిన నీరు కొన్ని నెలల వరకు ఆలాగే ఉంటున్నాయి. నీళ్లు నిలిచే వరకు ఉన్న భూమిలో గతంలో ఇరిగేషన్ అధికారులు హద్దులు పాతారు. ఆ హద్దులను పద్మావతి వెంచర్స్ డెవలపర్స్ యాజమాన్యం తొలిగించి, రెండు నెలలుగా రాత్రి పూట పెద్ద చెరువు శిఖం,ఎఫ్ టీఎల్‌ను పూర్తిగా మట్టితో పూడ్చుతున్నారు.

Rajiv Yuva Vikasam Scheme: నిరుద్యోగులూ.. అప్లై చేసుకున్నారా? కలెక్టర్ సమీక్ష

ఈ విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని స్వేచ్ఛ పత్రిక ఎత్తి చూపింది. ఈ మేరకు బుధవారం అధికారులు స్పందించి జేసీబీ సాయంతో ఎఫ్‌టీఎల్‌, శిఖం భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం