Student Death: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే క్రమశిక్షణ పేరుతో అమానుషంగా ప్రవర్తించి ఒక విద్యార్థిని మృతికి కారణమైన దారుణ ఘటన నగరంలోని మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల(Malkajgiri Government Junior College)లో చోటుచేసుకుంది. లెక్చరర్ల వేధింపులు తట్టుకోలేక ఇంటర్ విద్యార్థిని వర్షిణి(Varshini) మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..
తోటి విద్యార్థుల ముందే నిలబెట్టి..
మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న వర్షిణి(Varshini) ఒక రోజు స్వల్పంగా ఆలస్యంగా కళాశాలకు చేరుకుంది. దీనిని కారణంగా చేసుకున్న లెక్చరర్లు శ్రీలక్ష్మి(Sri Laxmi), మధురిమ(Madhurima) ఆమెను తోటి విద్యార్థుల ముందే నిలబెట్టి తీవ్రంగా అవమానించారు.“ఎందుకు లేటు?”, “పీరియడ్స్ వచ్చాయా?”, “నాటకాలు ఆడుతున్నావా?” అంటూ అత్యంత అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో విద్యార్థిని తీవ్ర మానసిక క్షోభకు గురైంది. కళాశాలలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక వర్షిణి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read: Iran Protests: ఇరాన్లో అల్లకల్లోలం.. వణుకు పుట్టించే దృశ్యాలు.. 45 మందికి పైగా మృతి!
లెక్చరర్ల మానసిక వేధింపులే కారణం
ఇంటికి చేరుకున్న తర్వాత కూడా అదే సంఘటన మదిలో మెదలుతూ తీవ్ర మనస్తాపానికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వర్షిణి మృతికి లెక్చరర్ల మానసిక వేధింపులే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట భారీ ఆందోళనకు దిగాయి. బాధ్యులైన లెక్చరర్లను వెంటనే అరెస్టు చేసి ఉద్యోగాల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రత, గౌరవంపై ఈ ఘటన తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Also Read: Anasuya Post: ఏంట్రా ఇలా ఉన్నారు!.. ఎవరు యూటర్న్ తీసుకుంది?.. అనసూయ..

