Stock Fraud Crime [ image credit: AI]
హైదరాబాద్

Stock Fraud Crime:సైబర్ క్రిమినల్స్ కు సాయం చేస్తూ.. అడ్డంగా బుక్కయ్యాడు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Stock Fraud Crime: స్టాక్​ ఫ్రాడ్​ నేరాలకు పాల్పడుతున్న సైబర్ క్రిమినల్స్​ కు బ్యాంక్​ ఖాతాలను సమకూరుస్తూ వచ్చిన వ్యక్తిని హైదరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుని నుంచి 3 సెల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం డీసీపీ డీ.కవిత తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి, హైదరాబాద్​ కు చెందిన ఓ సివిల్​ ఇంజనీర్​ కు కొంతకాలం క్రితం 9279871321 అన్న నెంబర్ నుంచి ఓ వాట్సాప్​ మెసెజీ వచ్చింది. దానిని పంపించిన వ్యక్తి తాము సూచించినట్టుగా స్టాక్​ మార్కెట్​ లో పెట్టుబడులు పెడితే దండిగా లాభాలు వస్తాయని ఆశ పెట్టాడు.

Also Read: Saweety Boora: పోలీసు స్టేషన్ లో వాగ్వాదం.. భర్తపై దాడి చేసిన ప్రముఖ మహిళా బాక్సర్

ఓ లింకును పంపించి దానిని తెరిచి గ్రూప్​ లో సభ్యునిగా చేరమన్నాడు. ఇది నమ్మిన బాధితుడు సదరు గ్రూపులో సభ్యునిగా చేరి మొదట్లో చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడులుగా పెట్టాడు. వీటికి సైబర్​ క్రిమినల్స్​ లాభాలను క్రెడిట్ చేశారు. ఆ మొత్తాలను బాధితుడు డ్రా కూడా చేసుకోగలిగాడు. అదే అదనుగా సైబర్​ నేరగాళ్లు ఎంత ఎక్కవు డబ్బు పెట్టుబడులుగా పెడితే అంత ఎక్కువగా లాభాలు వస్తాయని చెప్పటంతో పలు దఫాలుగా 20 లక్షల రూపాయలకు పైగా ఇన్వెస్ట్​ చేశాడు.

Also Read: Betting Apps Promotion Case: విచారణకు డుమ్మా కొట్టిన విష్ణుప్రియ.. రీతూ చౌదరి.. కారణం అదేనా?

తాను సభ్యునిగా చేరిన గ్రూపులో చెక్ చేసుకుంటే లాభాలు వచ్చినట్టుగా కనిపించటం తప్పితే ఆ మొత్తం విత్​ డ్రా కాకపోవటంతో బాధితుడు అదే విషయాన్ని సైబర్​ నేరగాళ్లకు తెలిపాడు. ఇప్పుడే డబ్బు డ్రా కాదని, మరో 15లక్షలు పెట్టుబడులుగా పెట్టాలని వాళ్లు చెప్పటంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ కే.సతీష్​ రెడ్డి ఎస్సై సురేశ్​, కానిస్టేబుళ్లు రాజేశ్​ కుమార్​, రాము, మల్లేశంలతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Nuthankal Murder Vase: హత్య కేసులో.. 13 మంది అరెస్ట్

విచారణలో బాధితుడు ఆన్​ లైన్​ ద్వారా ట్రాన్స్​ ఫర్ చేసిన 2‌‌‌‌0లక్షల రూపాయలు హర్యానా రాష్ర్టం గురుగావ్​ కు చెందిన హిమాన్షు స్వామి (28)తోపాటు పవన్ జైన్​ అనే వ్యక్తుల ఖాతాల్లో జమ అయినట్టుగా తేలింది. ఈ నేపథ్యంలో సిబ్బందితో కలిసి గురుగావ్​ వెళ్లిన సీఐ సతీష్​ రెడ్డి నిందితుల్లో ఒకడైన హిమాన్షు స్వామిని అరెస్ట్​ చేశారు. కాగా, పవన్​ జైన్​ పరారయ్యాడు. అరెస్టయిన హిమాన్షు స్వామికి ట్రై కమిషనరేట్లలో జరిగిన ఆరు ఫ్రాడ్​ కేసులతో సంబంధం ఉన్నట్టుగా డీసీపీ కవిత తెలిపారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?