Hyderabad Excise: ట్రావెల్ ఏజెంట్ ముసుగులో విదేశీ మద్యం దందా చేస్తున్న వ్యక్తితోపాటు అతని సహచరున్ని ఎక్సయిజ్ హైదరాబాద్ ఎన్ ఫోర్స్ మెంట్ (Hyderabad Excise) పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 52 విదేశీ మద్యం బాటిళ్లతోపాటు ఓ కారు, టూ వీలర్ ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ నివాసి సుమిత్ వృత్తిరీత్యా ట్రావెల్ ఏజెంట్. విదేశాలకు వెళ్లే వారి కోసం పాస్ పోర్ట్. వీసా వంటి వాటిని సమకూరుస్తుంటాడు. ఇలా తన ద్వారా విదేశాలకు వెళ్లిన వారిలో కొందరితో విదేశీ మద్యం సీసాలను తెప్పించుకుంటూ మూర్తి యుగేంధర్ తో కలిసి హైదరాబాద్ లో అధిక ధరలకు అమ్ముతున్నాడు.
43 విదేశీ మద్యం బాటిళ్లను సీజ్
ఇలా తెప్పించిన 9 విదేశీ మద్యం సీసాలను విక్రయించటానికి యుగేంధర్ స్కూటీపై బోరబండ ప్రాంతానికి రాగా సీఐ చంద్రశేఖర్ గౌడ్ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిళ్లు ఎక్కడివని ప్రశ్నించగా మనీష్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చినట్టుగా యుగంధర్ వెల్లడించాడు. ఈ క్రమంలో మనీష్ కుమార్ ఇంట్లో తనిఖీలు జరిపిన ఎక్సయిజ్ పోలీసులు ఓ కారుతోపాటు మరో 43 విదేశీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. అతన్ని జరిపిన విచారణలో ట్రావెల్ ఏజెంట్ గా పని చేస్తున్న సుమిత్ ఈ బాటిళ్లను తెప్పించి ఇస్తుంటాడని వెల్లడైంది. అయితే, సుమిత్ పోలీసుల చేతికి చిక్కలేదు. యుగంధర్, మనీష్ కుమార్ లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు॥ విదేశీ మద్యం దందా చేస్తున్న నిందితులను పట్టుకున్న సీఐ చంద్రశేఖర్ గౌడ్ తోపాటు ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు కరణ్ సింగ్, శ్రీకాంత్, సాయికుమార్, గోపాల్, ప్రసాద్ లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, ఏఈఎస్ స్మిత సౌజన్యలు అభినందించారు.
Also Read: TG Excise Department: దరఖాస్తుల సంఖ్యను పెంచేందుకు.. అబ్కారీ సిబ్బంది తిప్పలు
