Hyderabad Commissioner( IMAGE CREDIT : swetcha repoerter)
హైదరాబాద్

Hyderabad Commissioner: లాల్​ దర్వాజాకు సీపీ.. బోనాలకు పటిష్ట బందోబస్తు

Hyderabad Commissioner: బోనాలు సమీపిస్తున్న నేపథ్యంలో లాల్ దర్వాజా సింహ వాహిని మహంకాళి ఆలయానికి హైదరాబాద్ (, Hyderabad)​ కమిషనర్​ సీవీ ఆనంద్ (CV Anand) వచ్చారు. శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సీవీ ఆనంద్ (CV Anand)  మీడియాతో మాట్లాడారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 120 ఏండ్లుగా ఈ ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Also Read: Ujjaini Mahankali: అమ్మవారికి బోనం సమర్పించిన గవర్నర్ దంపతులు

పోలీస్ శాఖకు సహకరించాలి

నెలరోజులపాటు ప్రజలు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. బోనాల సందర్భంగా జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, ఈవ్ టీజింగ్ వంటివి జరగకుండా క్రైమ్ విభాగం పోలీసులు, షీ టీమ్ బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం  సాయంత్రం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలజ, అదనపు పోలీస్​ కమిషనర్ విక్రమ్​ సింగ్​ మాన్​, సౌత్​ జోన్​ డీసీపీ స్నేహా మెహ్రా తదితర అధికారులు ఛత్రినాక పోలీస్​ స్టేషన్‌లో బోనాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Also Read: KTR vs Kavitha: కేటీఆర్ వర్సెస్ కవిత.. పార్టీ ఒకటే.. దారులు మాత్రం వేరే

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?