Drug Peddlers Arrested: విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 40లక్షల రూపాయల విలువ చేసే గంజాయి, సింథటిక్ డ్రగ్స్ తోపాటు ఓ కారు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన దాంట్లో అమెరికా కాలిఫోర్నియాలో పండించే ఓజీ కుష్ (గంజాయి) కూడా ఉంది.
ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ ఆబ్కారీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్టుగా సమాచారాన్ని సేకరించిన ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ బీ టీం ఎస్సై సంధ్య సిబ్బందితో కలిసి దాడి చేశారు.
Hyderabad Rain Alert: హైదరాబాద్ లో జోరు వర్షం.. మరికొద్ది గంటల్లోనే..
ప్రతీష్ భట్, జైసూర్య అనే యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయితోపాటు 6గ్రాముల చరస్, 4.38గ్రాముల సింథటిక్ డ్రగ్స్, విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. స్కోడా కారుతోపాటు బైక్ ను సీజ్ చేశారు. సమావేశంలో ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ బీ టీం సీఐ ప్రదీప్ రావుతోపాటు సీఐ భిక్షారెడ్డి, ఎస్సైలు సంధ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు