illegal Alcohol Transportation: సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంతోపాటు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి విక్రయిస్తున్న గ్యాంగును ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4లక్షల రూపాయల విలువ చేసే 105 బాటిళ్ల ఢిల్లీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Ponnam Prabhakar: హైదరాబాద్ భద్రతపై.. మంత్రి పొన్నం ప్రభాకర్.. కీలక ప్రకటన!
నాగర్ కర్నూలు నివాసి రవీందర్ కత్రావత్ సెకండ్ హ్యాండ్ కార్లను కొని హైదరాబాద్ లో అమ్ముతుంటాడు. ఈ క్రమంలో తరచూ ఢిల్లీ వెళ్లి కార్లను కొని వాటిలో మద్యం సీసాలను ఇక్కడకు తెచ్చి హస్తినాపురం సంతోషిమాత కాలనీ నివాసి నాగిరెడ్డి ఇంట్లో పెట్టి అమ్ముతున్నాడు.
ఈ మేరకు సమాచారం అందటంతో ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ డీ టీం సీఐ నాగరాజు సిబ్బందితో కలిసి నాగరాజు ఇంటిపై దాడి చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు